అన్వేషించండి

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ - తీవ్రంగా శ్రమిస్తోన్న ఇంజినీర్ల బృందం, అలా చేస్తేనే..

Andhra News: వరుసగా తొమ్మిదో రోజు కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక బోటును తొలగించగా.. ఇంకా ఉన్న 2 పెద్ద బోట్లు, మరో చిన్న బోటును తొలగించాల్సి ఉంది.

Boats Removal Operation In Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రయత్నాల అనంతరం మంగళవారం ఒక బోటును అధికారులు బయటకు తీయగలిగారు. ఇంకా ఉన్న బోట్లను తొలగించేందుకు వరుసగా తొమ్మిదో రోజు సైతం ఇంజినీర్లు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రెండు పెద్ద బోట్లు, ఓ చిన్న బోటు నీళ్లలో ఇరుక్కున్నాయి. వీటిని తీయడం సవాల్‌గా మారగా.. ఉదయం నుంచి సగం నీటిలో తేలుతోన్న రెండో బోటును సవ్య దిశగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తేనే తప్ప బోటు కదిలించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జేసీబీ సాయంతో 200 మీటర్ల దూరం నుంచి తాడు ద్వారా దిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా బోట్లను తొలగించేందుకు శ్రమిస్తున్నామని.. త్వరలోనే ఆపరేషన్ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఈ నెల 2న ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతిలో 4 బోట్లు కొట్టుకొచ్చి వంతెన గేట్లను ఢీకొన్నాయి. దీంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతినగా.. మరమ్మతులు చేపట్టిన ఇంజినీరింగ్ నిపుణులు.. రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో 5 రోజుల్లోపే కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. అయితే, బోట్లు తొలగించే ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదు. తొలుత బోట్లను కోసి వాటిని భాగాలుగా చేసి ఒడ్డుకు చేర్చాలని భావించారు. అయితే, అది సాధ్యం కాలేదు. గత 6 రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో భారీ పడవలు, క్రేన్ల సాయంతో వాటిని ఒడ్డుకు చేర్చేలా ప్రణాళిక రచించారు. ఒక్కొక్కటి 50 టన్నుల సామర్థ్యం గల రెండు బోట్లను తెప్పించి వాటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించి.. క్రేన్ల సాయంతో వాటిని బయటకు తీసేలా ప్లాన్ చేశారు. ఎట్టకేలకు ఒక బోటును మాత్రం వెలికితీయగలిగారు. చివరకు మిగిలిన బోట్లను సైతం వెలికితీసేలా చర్యలు చేపట్టారు. 

అటు, ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కుట్రకోణంపై పోలీసులు విచారించారు. డ్యాంను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించిన పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించారు. ఆ బోట్లు ఉషాద్రి, కర్రి నరహింహా స్వామి, గూడూరు నాగమల్లీశ్వరిలకు చెందినవిగా గుర్తించారు. సాధారణంగా మూడింటిని కలిపి కట్టరని.. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పేర్కొన్నారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని నివేదికలో తెలిపారు. బోట్ల ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీని కూల్చడం ద్వారా 10 లక్షల మందికిపైగా ప్రజల్ని రిస్కులో పెట్టాలనుకున్నారని.. ఇది దేశద్రోహమేనని మండిపడ్డారు. 

Also Read: Balineni : జగన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బాలినేని - వైసీపీకి రాజీనామా - రేపో మాపో జనసేనలో చేరిక !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saudi bus crash: అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Advertisement

వీడియోలు

Hombale Films to Buy RCB ? | RCB ఓనర్లుగా హోంబలే ఫిల్మ్స్ ?
Pujara on South Africa vs India Test Match | ప్లేయర్స్ కు సలహా ఇచ్చిన పుజారా
India vs South Africa First Test Match | భారత్ ఓటమికి కారణాలివే
Shubman Gill Injury India vs South Africa | పంత్ సారధ్యంలో రెండో టెస్ట్ ?
విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Saudi bus crash: అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Amazon Lay offs: 3 నెలలకు 18 బిలియన్ డాలర్ల లాభం  అయినా 14వేల మందిని తీసేస్తున్న అమెజాన్ - ఇదెక్కడి ఘోరం ?
3 నెలలకు 18 బిలియన్ డాలర్ల లాభం అయినా 14వేల మందిని తీసేస్తున్న అమెజాన్ - ఇదెక్కడి ఘోరం ?
Dhandoraa Teaser : చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
Embed widget