అన్వేషించండి

AP Group 1 : ఏపీ గ్రూప్ -1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. మెయిన్ పేపర్లు మాన్యువల్ పద్దతిలో దిద్ది ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు !

గ్రూప్ వన్ ఇంటర్యూలపై స్టే ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టింది. కొత్తగా మాన్యువల్ పద్దతిలో మూల్యంకనం చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోఫలితాల్లో ప్రకటించాలని స్పష్టం చేసింది.


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల పత్రాలను మళ్లీ మాన్యూవల్‌గా మూల్యంకనం చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే జారీ చేసిన మెయిన్ ఫలితాలను పక్కన పెట్టినట్లయింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2018లో ఎపీపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు జరిగాయి. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పరీక్షల ఫలితాలను నిలిపివేశారు. ఆ తర్వాత మార్కుల మూల్యంకన పద్దతిలో మార్పులు చేశారు. మాన్యువల్ పద్దతిని తీసేసి  టెక్నికల్ పద్దతిలో మ్యూల్యంకనం చేసి ఫలితాలను ప్రకటించారు. 

Also Read : ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం..

అయితే ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడిందని పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు ఇంటర్యూలను నిలిపివేసింది.  గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది . మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది.  డిజిటల్ వాల్యూయేషన్ అనేది నోటిఫికేషన్‌లో లేదని తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని .. దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. 

Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..

ఈ అంశంపై   జరుగుతున్న విచారణలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన పని తనను చేసుకోనివ్వలేదని ఆఫీసుకు కూడా రానివ్వలేదని చాంబర్‌తో పాటు అటెండర్ ను కూడా ఇవ్వలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన విధులను ఆటంక పరిచారని.. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారని ఆ నిర్ణయాలేవీ తన ఆమోదంతో జరగలేదని స్పష్టం చేశారు.  

Also Read: ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం..

గ్రూప్స్ లో ర్యాంక్ సాధించలేని కొంతమంది ఇటీవల సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించారు. దీంతో నిజంగానే గ్రూప్స్ మూల్యంకనంలో అక్రమాలు జరిగాయని.. పెద్ద అత్తున అర్హుల్ని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో  గ్రూప్ వన్ పరీక్షలు రాసిన వారికి కాస్తంత రిలీఫ్ దక్కనుంది. మాన్యూవల్ మూల్యంకనం తర్వాత అసలు ఫలితాలు ప్రకటించి ఇంటర్యూలు నిర్వహించనున్నారు. 

Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Advertisement

వీడియోలు

వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. దశాబ్దాల కలకి అడుగు దూరంలో..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Madalasa Sharma : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు  అవసరమైన చోట అదరగొట్టేసింది..!
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు అవసరమైన చోట అదరగొట్టేసింది..!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
Embed widget