అన్వేషించండి

AP Group 1 : ఏపీ గ్రూప్ -1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. మెయిన్ పేపర్లు మాన్యువల్ పద్దతిలో దిద్ది ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు !

గ్రూప్ వన్ ఇంటర్యూలపై స్టే ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టింది. కొత్తగా మాన్యువల్ పద్దతిలో మూల్యంకనం చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోఫలితాల్లో ప్రకటించాలని స్పష్టం చేసింది.


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల పత్రాలను మళ్లీ మాన్యూవల్‌గా మూల్యంకనం చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే జారీ చేసిన మెయిన్ ఫలితాలను పక్కన పెట్టినట్లయింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2018లో ఎపీపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు జరిగాయి. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పరీక్షల ఫలితాలను నిలిపివేశారు. ఆ తర్వాత మార్కుల మూల్యంకన పద్దతిలో మార్పులు చేశారు. మాన్యువల్ పద్దతిని తీసేసి  టెక్నికల్ పద్దతిలో మ్యూల్యంకనం చేసి ఫలితాలను ప్రకటించారు. 

Also Read : ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం..

అయితే ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడిందని పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు ఇంటర్యూలను నిలిపివేసింది.  గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది . మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది.  డిజిటల్ వాల్యూయేషన్ అనేది నోటిఫికేషన్‌లో లేదని తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని .. దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. 

Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..

ఈ అంశంపై   జరుగుతున్న విచారణలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన పని తనను చేసుకోనివ్వలేదని ఆఫీసుకు కూడా రానివ్వలేదని చాంబర్‌తో పాటు అటెండర్ ను కూడా ఇవ్వలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన విధులను ఆటంక పరిచారని.. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారని ఆ నిర్ణయాలేవీ తన ఆమోదంతో జరగలేదని స్పష్టం చేశారు.  

Also Read: ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం..

గ్రూప్స్ లో ర్యాంక్ సాధించలేని కొంతమంది ఇటీవల సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించారు. దీంతో నిజంగానే గ్రూప్స్ మూల్యంకనంలో అక్రమాలు జరిగాయని.. పెద్ద అత్తున అర్హుల్ని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో  గ్రూప్ వన్ పరీక్షలు రాసిన వారికి కాస్తంత రిలీఫ్ దక్కనుంది. మాన్యూవల్ మూల్యంకనం తర్వాత అసలు ఫలితాలు ప్రకటించి ఇంటర్యూలు నిర్వహించనున్నారు. 

Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Embed widget