అన్వేషించండి

రైతులకు అండగా నిలిచాం, వైయస్ఆర్ జలకళ లెక్కలు చెప్పిన పెద్దిరెడ్డి

రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయన శాసన సభలో వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి పెద్దిరెడ్డి...
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని రైతులకు వైయస్ఆర్ జలకళ పథకం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల ప్రగతిపై మంత్రి పెద్దిరెడ్డి, సభకు వివరించారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలో కూడా అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందని తెలిపారు. వీటితో పాటుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్ ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 2,28,421 అయితే దానిలో సచివాలయాల్లో విఆర్వోలు ఆమోదించినవి 1,88,571 దరఖాస్తులు, భూగర్భ జల శాఖ సర్వే పూర్తి చేసినవి 66,190 దరఖాస్తులు, వీటిల్లో కలెక్టర్లు 42,388 దరఖాస్తులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న వాటిల్లో 19,908 బోర్ బావులకు డ్రిల్లింగ్ పూర్తి చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బోర్లంటే...
రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని, మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అయిదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద మంజూరు చేసిన బోరుబావులకు ఉచితంగానే విద్యుదీకరణ చేస్తున్నట్లు సభలో తెలిపారు. ఉచితంగా విద్యుదీకరణ చేసినవి 1721, దీనికి చేసిన వ్యయం రూ.54.95 కోట్లుగా వెల్లడించారు.
టీడీపీ హయాంలో అలా...
గత ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పేరుతో రైతులకు ఉచిత బోరు బావులను మంజూరు చేసిందని పెద్దిరెడ్డి అన్నారు. అయితే అవన్నీ కేవలం కమాండ్ ఏరియాల్లో మాత్రమే అమలు చేశారని, అదికూడా కేవలం రెండు వందల అడుగులు వరకు మాత్రమే డ్రిల్లింగ్ కు అవకాశం కల్పించారని అన్నారు. గత అయిదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన బోరుబావులు కేవలం 33,116 మాత్రమేనని వెల్లడించారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.99.35 కోట్లు మాత్రమేనని సభలో లెక్కలు వివరించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు ఆయా మండలాల్లో ఎంపిడిఓల ద్వారా మాత్రమే మంజూరు చేశారని, అదికూడా మొదటి వచ్చిన దరఖాస్తుకు మొదటి ప్రాధాన్యత అనే విధానాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. 
ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు వైయస్ఆర్ జలకళ కింద బోరుబావులను మంజూరు చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కమాండ్ ఏరియాతో పాటు నాన్ కమాండ్ ఏరియాలోనూ బోరు బావులను మంజూరు చేస్తున్నామని, జియాలజిస్ట్ లు ఎంత లోతు వరకు సిఫారస్ చేస్తే అంత వరకు డ్రిల్లింగ్ చేయిస్తున్నామని చెప్పారు. పారదర్శకత కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల స్థాయిలోనే విఆర్వోల ద్వారా ప్రతి దరఖాస్తును వెరిఫై చేయిస్తున్నాం. ఈ నాలుగేళ్ళలో వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటం, చెరువుల్లో సాగునీరు ఉండటం, సాగుకు కొరత లేకపోవడం వల్ల రైతుల నుంచి కూడా బోరుబావుల కోసం అంతగా ఆసక్తి వ్యక్తం కాలేదని తెలిపారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటి వరకు విద్యుత్ శాఖ ద్వారా 1.21 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్ లను ఇచ్చామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget