అన్వేషించండి

రైతులకు అండగా నిలిచాం, వైయస్ఆర్ జలకళ లెక్కలు చెప్పిన పెద్దిరెడ్డి

రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయన శాసన సభలో వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి పెద్దిరెడ్డి...
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని రైతులకు వైయస్ఆర్ జలకళ పథకం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల ప్రగతిపై మంత్రి పెద్దిరెడ్డి, సభకు వివరించారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలో కూడా అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందని తెలిపారు. వీటితో పాటుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్ ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 2,28,421 అయితే దానిలో సచివాలయాల్లో విఆర్వోలు ఆమోదించినవి 1,88,571 దరఖాస్తులు, భూగర్భ జల శాఖ సర్వే పూర్తి చేసినవి 66,190 దరఖాస్తులు, వీటిల్లో కలెక్టర్లు 42,388 దరఖాస్తులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న వాటిల్లో 19,908 బోర్ బావులకు డ్రిల్లింగ్ పూర్తి చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బోర్లంటే...
రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని, మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అయిదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద మంజూరు చేసిన బోరుబావులకు ఉచితంగానే విద్యుదీకరణ చేస్తున్నట్లు సభలో తెలిపారు. ఉచితంగా విద్యుదీకరణ చేసినవి 1721, దీనికి చేసిన వ్యయం రూ.54.95 కోట్లుగా వెల్లడించారు.
టీడీపీ హయాంలో అలా...
గత ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పేరుతో రైతులకు ఉచిత బోరు బావులను మంజూరు చేసిందని పెద్దిరెడ్డి అన్నారు. అయితే అవన్నీ కేవలం కమాండ్ ఏరియాల్లో మాత్రమే అమలు చేశారని, అదికూడా కేవలం రెండు వందల అడుగులు వరకు మాత్రమే డ్రిల్లింగ్ కు అవకాశం కల్పించారని అన్నారు. గత అయిదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన బోరుబావులు కేవలం 33,116 మాత్రమేనని వెల్లడించారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.99.35 కోట్లు మాత్రమేనని సభలో లెక్కలు వివరించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు ఆయా మండలాల్లో ఎంపిడిఓల ద్వారా మాత్రమే మంజూరు చేశారని, అదికూడా మొదటి వచ్చిన దరఖాస్తుకు మొదటి ప్రాధాన్యత అనే విధానాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. 
ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు వైయస్ఆర్ జలకళ కింద బోరుబావులను మంజూరు చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కమాండ్ ఏరియాతో పాటు నాన్ కమాండ్ ఏరియాలోనూ బోరు బావులను మంజూరు చేస్తున్నామని, జియాలజిస్ట్ లు ఎంత లోతు వరకు సిఫారస్ చేస్తే అంత వరకు డ్రిల్లింగ్ చేయిస్తున్నామని చెప్పారు. పారదర్శకత కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల స్థాయిలోనే విఆర్వోల ద్వారా ప్రతి దరఖాస్తును వెరిఫై చేయిస్తున్నాం. ఈ నాలుగేళ్ళలో వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటం, చెరువుల్లో సాగునీరు ఉండటం, సాగుకు కొరత లేకపోవడం వల్ల రైతుల నుంచి కూడా బోరుబావుల కోసం అంతగా ఆసక్తి వ్యక్తం కాలేదని తెలిపారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటి వరకు విద్యుత్ శాఖ ద్వారా 1.21 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్ లను ఇచ్చామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget