అన్వేషించండి

రైతులకు అండగా నిలిచాం, వైయస్ఆర్ జలకళ లెక్కలు చెప్పిన పెద్దిరెడ్డి

రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయన శాసన సభలో వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి పెద్దిరెడ్డి...
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని రైతులకు వైయస్ఆర్ జలకళ పథకం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల ప్రగతిపై మంత్రి పెద్దిరెడ్డి, సభకు వివరించారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలో కూడా అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందని తెలిపారు. వీటితో పాటుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్ ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 2,28,421 అయితే దానిలో సచివాలయాల్లో విఆర్వోలు ఆమోదించినవి 1,88,571 దరఖాస్తులు, భూగర్భ జల శాఖ సర్వే పూర్తి చేసినవి 66,190 దరఖాస్తులు, వీటిల్లో కలెక్టర్లు 42,388 దరఖాస్తులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న వాటిల్లో 19,908 బోర్ బావులకు డ్రిల్లింగ్ పూర్తి చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బోర్లంటే...
రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని, మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అయిదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద మంజూరు చేసిన బోరుబావులకు ఉచితంగానే విద్యుదీకరణ చేస్తున్నట్లు సభలో తెలిపారు. ఉచితంగా విద్యుదీకరణ చేసినవి 1721, దీనికి చేసిన వ్యయం రూ.54.95 కోట్లుగా వెల్లడించారు.
టీడీపీ హయాంలో అలా...
గత ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పేరుతో రైతులకు ఉచిత బోరు బావులను మంజూరు చేసిందని పెద్దిరెడ్డి అన్నారు. అయితే అవన్నీ కేవలం కమాండ్ ఏరియాల్లో మాత్రమే అమలు చేశారని, అదికూడా కేవలం రెండు వందల అడుగులు వరకు మాత్రమే డ్రిల్లింగ్ కు అవకాశం కల్పించారని అన్నారు. గత అయిదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన బోరుబావులు కేవలం 33,116 మాత్రమేనని వెల్లడించారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.99.35 కోట్లు మాత్రమేనని సభలో లెక్కలు వివరించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు ఆయా మండలాల్లో ఎంపిడిఓల ద్వారా మాత్రమే మంజూరు చేశారని, అదికూడా మొదటి వచ్చిన దరఖాస్తుకు మొదటి ప్రాధాన్యత అనే విధానాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. 
ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు వైయస్ఆర్ జలకళ కింద బోరుబావులను మంజూరు చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కమాండ్ ఏరియాతో పాటు నాన్ కమాండ్ ఏరియాలోనూ బోరు బావులను మంజూరు చేస్తున్నామని, జియాలజిస్ట్ లు ఎంత లోతు వరకు సిఫారస్ చేస్తే అంత వరకు డ్రిల్లింగ్ చేయిస్తున్నామని చెప్పారు. పారదర్శకత కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల స్థాయిలోనే విఆర్వోల ద్వారా ప్రతి దరఖాస్తును వెరిఫై చేయిస్తున్నాం. ఈ నాలుగేళ్ళలో వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటం, చెరువుల్లో సాగునీరు ఉండటం, సాగుకు కొరత లేకపోవడం వల్ల రైతుల నుంచి కూడా బోరుబావుల కోసం అంతగా ఆసక్తి వ్యక్తం కాలేదని తెలిపారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటి వరకు విద్యుత్ శాఖ ద్వారా 1.21 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్ లను ఇచ్చామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget