అన్వేషించండి

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్

Rice and Kandipappu at Rythu Bazar | ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. జూలై 11 నుంచి రైతు బజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయించనున్నారు.

Nadendla Manohar About Ration Items: అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకు కందిపప్పు, బియ్యం విక్రయించడంపై ఫోకస్ చేసింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేషన్ దుకాణాలలో సరుకుల పంపిణీ, నాణ్యత పరిశీలిస్తూ అధికారులను పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల శుభవార్త చెప్పారు. జులై 11 నుంచి రేషన్ షాపుల్లో తక్కువ ధరకు కందిపప్పు, బియ్యం సరఫరా చేయడానికి నిర్ణయించారు. 


రాష్ట్రంలో ధరల స్థిరీకరణపై జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమీక్ష నిర్వహించారు. సామాన్యులకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకే ఇచ్చేలా చేయడంలో భాగంగా వ్యాపారులతో సమావేశమయ్యారు. బ్లాక్‌ మార్కెట్‌ లో విక్రయాలు లాంటివి చేయవద్దని సూచించారు. జులై 11 నుంచి రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. రూ.160 కిలో కందిపప్పు, రూ.49కే స్టీమ్డ్‌ రైస్‌, రూ.48కి ముడి బియ్యం విక్రయించాలని మంత్రి నాదెండ్ల నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.180 ఉండగా, స్టీమ్డ్‌ రైస్‌ రూ.55, 56 ఉంది. ముడి బియ్యం కేజీ ధర రూ.52.40కి విక్రయాలు జరుగుతున్నాయి. 

 

బియ్యం అక్రమాల కేసు సీఐడీకి అప్పగింత

కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కదుపుతోంది. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లర్లు ఎగుమతుల వరకు రేషన్ బియ్యం సేకరించి మళ్లీ ఆ బియ్యాన్ని రీసైకిల్‌ చేసి ఎగుమతులు చేశారని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపడిని ఇరుకున పెట్టేలా మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడలో రివ్వూల నుంచి తనిఖీలు చేశారు. సివిల్‌ సప్లై అధికారులు నాదెండ్ల దూకుడు చూసి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేపట్టిన తనిఖీల్లో బియ్యం ఎగుమతుల అనేక అక్రమాలు వెలుగుచూశాయి. త్వరలోనే వీటి వివరాలు బయట పెట్టి, అక్రమార్కుల ఆట కట్టిస్తామని సైతం ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. తనిఖీల వ్యవహారం అప్ డేట్స్, ముందస్తు సమాచారాన్ని అధికారులు చేరవేస్తున్నారని గుర్తించిన మంత్రి వారిని హెచ్చరించారని గట్టిగానే వినిపిస్తోంది. బియ్యం అక్రమాల కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టి నిజాలు బయటకు తేనుందని ఏపీ మంత్రులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Hyderabad News: భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Embed widget