By: ABP Desam | Updated at : 16 Nov 2021 03:27 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఏపీ స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 26 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అమల్లోకి ఎన్నికల కోడ్
ఏపీలో అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క స్థానం, కృష్ణ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో రెండేసి ఖాళీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. డిసెంబరు 10న ఈ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న కౌంటింగ్ చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా బి–ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా. pic.twitter.com/GAV5M9qCLP
— YSR Congress Party (@YSRCParty) November 16, 2021
వైసీపీ అభ్యర్థులు వీరే..!
ఇప్పటికే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇందుకూరు రాజు (విజయనగరం), వరుదు కళ్యాణి (విశాఖ), వంశీ కృష్ణయాదవ్ (విశాఖ), అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి), మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా), తలశిల రఘురామ్ (కృష్ణా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు), మురుగుడు హనుమంతరావు (గుంటూరు), తూమాటి మాధవరావు (ప్రకాశం), కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), వై శివరామిరెడ్డి (అనంతపురం) పేర్లను వైసీపీ ఖరారు చేసింది.
Also Read: కుప్పం కౌంటింగ్ వీడియో తీసి సమర్పించాలి.. ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశం !
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం సీఎం జగన్ కలిశారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందించారు. శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు నుంచి ఇసాక్ బాషా, కడప నుంచి డీసీ గోవిందరెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫాం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్కు వెళ్లి నామినేషన్ వేయనున్నారు.
Also Read: ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు
Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>