అన్వేషించండి

AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

ఏపీ స్థానిక సంస్థల కోటా 12 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ చేసింది. డిసెంబర్ 10న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

ఏపీ స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు మంగళవారం నోటిఫికేష‌న్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 23 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేష‌న్లు పరిశీలిస్తారు. నవంబర్ 26 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబ‌ర్ 10న పోలింగ్, డిసెంబ‌ర్ 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

అమల్లోకి ఎన్నికల కోడ్

ఏపీలో అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క స్థానం, కృష్ణ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో రెండేసి ఖాళీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. డిసెంబరు 10న ఈ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న కౌంటింగ్ చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్  ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 

Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !

వైసీపీ అభ్యర్థులు వీరే..!

ఇప్పటికే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇందుకూరు రాజు (విజయనగరం), వరుదు కళ్యాణి (విశాఖ), వంశీ కృష్ణయాదవ్ (విశాఖ), అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి), మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా), తలశిల రఘురామ్ (కృష్ణా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు), మురుగుడు హనుమంతరావు (గుంటూరు), తూమాటి మాధవరావు (ప్రకాశం), కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), వై శివరామిరెడ్డి (అనంతపురం) పేర్లను వైసీపీ ఖరారు చేసింది. 

Also Read: కుప్పం కౌంటింగ్‌ వీడియో తీసి సమర్పించాలి.. ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం !

ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం సీఎం జగన్ కలిశారు. సీఎం జగన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందించారు. శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు నుంచి ఇసాక్‌ బాషా, కడప నుంచి డీసీ గోవిందరెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్‌ చేతుల మీదుగా బీఫాం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్‌కు వెళ్లి నామినేషన్‌ వేయనున్నారు. 

Also Read: ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.