అన్వేషించండి

AP Liquor Scam Update: ఏపీ లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు - జగన్ సన్నిహితుల బెయిల్ రద్దు

AP High Court: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ సన్నిహితులైన ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గో కోర్టు ఎదుట లొంగిపోనున్నారు.

AP High Court rules cancel default bail of three close associates of Jagan: ఆంధ్రప్రదేశ్‌లో  లిక్కర్ స్కాంలో  ముఖ్య నిందితులైన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి  సన్నిహితులు కె. ధనుంజయ్ రెడ్డి,  పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది.   ఈ నెల 26నలోగా వారు కోర్టు ముందు సరెండర్ అవ్వాలని హైకోర్టు ఆదేశించింది.    

గతంలో మూడు నెలల పాటు జైల్లో ఉన్న నిందితులు           

సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  దర్యాప్తులో ఈ ముగ్గురు లిక్కర్ స్కాంలో డబ్బులను  లంచాల రూపంలో తీసుకున్నారని గుర్తించారు.  ధనుంజయ్ రెడ్డి , మాజీ   IAS అధికారి,  జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంవోను ఒంటి చేత్తో నడిపించారు.  కృష్ణమోహన్ రెడ్డి  జగన్ OSDగా ఉండేవారు.  బాలాజీ గోవిందప్ప  భారతి సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, షెల్ కంపెనీల ద్వారా  లిక్కర్ స్కామ్ లంచాలను కంపెనీలోకి మళ్లించినట్లుగా సీఐడీ ఆరోపిస్తోంది.      

చార్జిషీటు దాఖలు చేయలేదని డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు             

వీరిపై అరెస్టు తర్వాత 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేసుకుని, ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అయితే, సిట్ 'మేము సమయానికే చార్జ్‌షీట్ ఫైల్ చేశాం, కానీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు' అని వాదించి, హైకోర్టులో పిటిషన్ వేసింది.  విచారణలో, 'దర్యాప్తు కీలక దశలో ఉంది, డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం ద్వారా న్యాయం దెబ్బతింటుంది' అని హైకోర్టు గుర్తించి, బెయిల్‌ను రద్దు చేసింది. ఈ తీర్పు ప్రకారం, 26న సరెండర్  కావాల్సి ఉంది.          

సమయానికే చార్జిషీటు దాఖలు చేసినా బెయిల్ ఇచ్చారని హైకోర్టులో సిట్ పిటిషన్          

లిక్కర్ స్కాంలో తమ పేర్లు ఉన్నందున ముందస్తు బెయిల్ కోసం వీరు గతంలో ప్రయత్నించారు. మే 2న హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌లు డిస్మిస్ చేసింది. మే 7న మళ్లీ డిస్మిస్. మే 16న సుప్రీంకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్‌కు తీర్పు ఇవ్వకపోవడంతో, ధనుంజయ్, కృష్ణమోహన్‌లను సిట్ అరెస్టు చేసింది. బాలాజీని మే 14న కర్ణాటకలో పట్టుకుని విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరిచారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు కాలేదు.           

లొంగిపోయి సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితులు

సిట్ రిపోర్టుల ప్రకారం,  వైసీపీ  హయాంలో మద్యం వ్యాపారాన్ని కొందరికే పరిమితం చేసి, డిస్టిలరీల నుంచి భారీ కమీషన్లు సేకరించారు. ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా జగన్ పక్షానికి మార్చారు. మొత్తం రూ.3,000-3,200 కోట్ల అక్రమ సంపాదన చేసినట్లుగా గుర్తించారు. నిందితుల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Advertisement

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget