అన్వేషించండి

Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

Union Cabinet: జనాభా గణనను పూర్తి డిజిటల్ విధానంలో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం రూ. 11718 కోట్లు బడ్జెట్ కేటాయించారు.

Union Cabinet approves 11718 crore for Census 2027:  భారత ప్రభుత్వం 2027 జనగణనకు 11,718 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆమోదించింది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి పూర్తిగా డిజిటల్‌గా జరిగే సెన్సస్‌గా ఉంటుంది. కుల గణనను కూడా చేస్తారు. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్   ప్రకటించారు.  సెన్సస్ 2027 మొదటి డిజిటల్ సెన్సస్‌గా ఉంటుంది. ఇది సమాచార సేకరణను సులభతరం చేస్తూ, ఖచ్చితత్వాన్ని పెంచుతుంది అని వైష్ణవ్ పేర్కొన్నారు.  
 
2021  జనాభా గణన కోవిడ్ మహమ్మారి వల్ల ఆలస్యమై, ఇప్పటికీ జరగలేదు. దీంతో 2027లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ సారి జనాభా లెక్కల్లో కుల గణన చేర్చడం ప్రధాన మలుపు . ఇది భారతదేశంలో మొదటిసారి కుల డేటాను సమగ్రంగా సేకరించే అవకాశం.  సెన్సస్ 2027లో కుల గణన భాగంగా ఉంటుంది. ఇది సామాజిక-ఆర్థిక విశ్లేషణలకు ఆధారం అవుతుందని  కేంద్రం చెబుతోంది. డిజిటల్ ఫార్మాట్‌లో ఆన్‌లైన్ టూల్స్, మొబైల్ యాప్‌లు, డేటా ఎంట్రీ సిస్టమ్‌లను ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తారు. ఇది సాంప్రదాయిక పేపర్-బేస్డ్ పద్ధతుల కంటే ఖర్చును తగ్గించి, డేటా ఖచ్చితత్వాన్ని 20-30% పెంచుతుందని అధికారులు అంచనా.   

ప్రశ్నావళి వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, సెన్సస్ డేటా యూజర్ల సూచనల ఆధారంగా రూపొందిస్తారు. ఇందులో జనాభా, వృద్ధి రేటు, లింగ నిష్పత్తి, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సాధారణ డేటా ప్రధానంగా ఉంటాయి.  సెన్సస్ రెండు దశల్లో జరుగుతుంది.  మొదటి దశ (ఫేజ్ I) హౌస్ లిస్టింగ్ ,  హౌసింగ్ సెన్సస్‌గా ఉంటుంది. ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు 30 రోజుల్లో జరుగుతుంది. రెండో దశ (ఫేజ్ II) పాపులేషన్ ఎన్యూమరేషన్ (PE)గా ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఈ దశలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సౌకర్యాలకు అనుగుణంగా నిర్వహిస్తారు.  డిజిటల్ ప్లాట్‌ఫామ్ వల్ల రియల్-టైమ్ డేటా అప్‌లోడ్, వెరిఫికేషన్ సులభమవుతాయి. 

సాంప్రదాయ సెన్సస్‌ల కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, డిజిటల్ టెక్నాలజీ వల్ల దీర్ఘకాలంలో ఖర్చు తగ్గుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ డేటా భవిష్యత్ విధానాలు, రిజర్వేషన్లు, బడ్జెట్ విభజనలకు కీలకం అవుతుంది. ముఖ్యంగా, కుల డేటా OBC, SC/STలకు మరింత ప్రయోజనాలు అందించేలా సహాయపడవచ్చునని భావిస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Train Ticket Rules: రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Vinicius Junior Record:  బ్రెజిల్ సూపర్‌స్టార్ వినిసియస్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. లెజెండ్స్ క్లబ్ లోకి ఎంట్రీ!
బ్రెజిల్ సూపర్‌స్టార్ వినిసియస్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. లెజెండ్స్ క్లబ్ లోకి ఎంట్రీ!
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget