అన్వేషించండి

Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

Union Cabinet: జనాభా గణనను పూర్తి డిజిటల్ విధానంలో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం రూ. 11718 కోట్లు బడ్జెట్ కేటాయించారు.

Union Cabinet approves 11718 crore for Census 2027:  భారత ప్రభుత్వం 2027 జనగణనకు 11,718 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆమోదించింది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి పూర్తిగా డిజిటల్‌గా జరిగే సెన్సస్‌గా ఉంటుంది. కుల గణనను కూడా చేస్తారు. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్   ప్రకటించారు.  సెన్సస్ 2027 మొదటి డిజిటల్ సెన్సస్‌గా ఉంటుంది. ఇది సమాచార సేకరణను సులభతరం చేస్తూ, ఖచ్చితత్వాన్ని పెంచుతుంది అని వైష్ణవ్ పేర్కొన్నారు.  
 
2021  జనాభా గణన కోవిడ్ మహమ్మారి వల్ల ఆలస్యమై, ఇప్పటికీ జరగలేదు. దీంతో 2027లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ సారి జనాభా లెక్కల్లో కుల గణన చేర్చడం ప్రధాన మలుపు . ఇది భారతదేశంలో మొదటిసారి కుల డేటాను సమగ్రంగా సేకరించే అవకాశం.  సెన్సస్ 2027లో కుల గణన భాగంగా ఉంటుంది. ఇది సామాజిక-ఆర్థిక విశ్లేషణలకు ఆధారం అవుతుందని  కేంద్రం చెబుతోంది. డిజిటల్ ఫార్మాట్‌లో ఆన్‌లైన్ టూల్స్, మొబైల్ యాప్‌లు, డేటా ఎంట్రీ సిస్టమ్‌లను ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తారు. ఇది సాంప్రదాయిక పేపర్-బేస్డ్ పద్ధతుల కంటే ఖర్చును తగ్గించి, డేటా ఖచ్చితత్వాన్ని 20-30% పెంచుతుందని అధికారులు అంచనా.   

ప్రశ్నావళి వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, సెన్సస్ డేటా యూజర్ల సూచనల ఆధారంగా రూపొందిస్తారు. ఇందులో జనాభా, వృద్ధి రేటు, లింగ నిష్పత్తి, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సాధారణ డేటా ప్రధానంగా ఉంటాయి.  సెన్సస్ రెండు దశల్లో జరుగుతుంది.  మొదటి దశ (ఫేజ్ I) హౌస్ లిస్టింగ్ ,  హౌసింగ్ సెన్సస్‌గా ఉంటుంది. ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు 30 రోజుల్లో జరుగుతుంది. రెండో దశ (ఫేజ్ II) పాపులేషన్ ఎన్యూమరేషన్ (PE)గా ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఈ దశలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సౌకర్యాలకు అనుగుణంగా నిర్వహిస్తారు.  డిజిటల్ ప్లాట్‌ఫామ్ వల్ల రియల్-టైమ్ డేటా అప్‌లోడ్, వెరిఫికేషన్ సులభమవుతాయి. 

సాంప్రదాయ సెన్సస్‌ల కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, డిజిటల్ టెక్నాలజీ వల్ల దీర్ఘకాలంలో ఖర్చు తగ్గుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ డేటా భవిష్యత్ విధానాలు, రిజర్వేషన్లు, బడ్జెట్ విభజనలకు కీలకం అవుతుంది. ముఖ్యంగా, కుల డేటా OBC, SC/STలకు మరింత ప్రయోజనాలు అందించేలా సహాయపడవచ్చునని భావిస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget