అన్వేషించండి

AP Encounter Latest News: ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతం: మహేష్ చంద్ర లడ్డా

ఏపీలో వరుసగా రెండో రోజు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.

Encounter In Alluri Sitharamaraju district | విజయవాడ: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఏపీలో వరుసగా రెండో రోజు కూంబింగ్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో నక్సల్స్,  పోలీసులకు మధ్య బుధవారం సైతం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సుమారు ఆరుగురి నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా అడిషనల్ డి.జి. మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. 

విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారి కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న తరుణంలో మావోయిస్టులో ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాలను వదిలి ఏపీకి మకాం మార్చ ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అల్లూరి సీతారామరాజు సహా ఇతర ఏజెన్సీ జిల్లాల్లో పోలిసులు మావోయిస్టుల కదలకలపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

పక్కా సమాచారంతో ఆపరేషన్

నవంబరు 17న పోలీసులు కీలకమైన ఆపరేషన్ చేపట్టామని లడ్డా తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నిన్న (నవంబర్ 18న) మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నాయకులలో ఒకరైన హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. అయితే, హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని లడ్డా స్పష్టం చేశారు. మృతుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో నిన్న ఎన్‌కౌంటర్ లో చనిపోయిన మాడావి హిడ్మా, ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను నేడు వారి కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. 

హిడ్మా బ్యాచ్ ఖేల్ ఖతం..

ఈ ఆపరేషన్లో భాగంగా ఎన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి ఏకంగా యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నామని అడిషనల్ డి.జి. మహేష్ చంద్ర లడ్డా వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో కీలక వ్యక్తులను ఒకేసారి పట్టుకోవడం ఇదే తొలిసారి అన్నారు.  పట్టుబడిన వారిలో కేంద్ర, రాష్ట్ర, ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ టీమ్ సభ్యులు ఉన్నారని, ఎక్కడా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ఆపరేషన్‌లో 45 వెపన్స్, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్‌లు, 750 గ్రాముల వైర్ మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్‌ను పూర్తి చేశారని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ లడ్డా అభినందించారు. తమ ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. తెలంగాణలో ఇటీవల కొంతమంది మావోయిస్టులు సరెండర్ అవ్వడం వల్ల, ఆ సమాచారం తమ ప్రాంతాలకు వెళితే ఇబ్బందులు వస్తాయని భావించిన మావోయిస్టులు, కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలోని పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తమకు ముందే సమాచారం వచ్చినా, వారి కదలికలు, కార్యకలాపాలపై నిఘా పెట్టి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఒకేసారి అందరినీ పట్టుకోగలిగామని, వారి తదుపరి మూవ్‌మెంట్లు లేదా ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు లేవని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget