అన్వేషించండి

APPSC: 28 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పరీక్షలు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రొబేషన్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. డిపార్ట్‌మెంట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని అభ్యర్థులకు కల్పించింది. ఓటీపీ ద్వారా ఇందులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా వచ్చే యూజర్ ఐడీతో ఈ నెల 13వ తేదీ నుంచి 17 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్ష 100 మార్కులకు నిర్వహించనున్నారు. 100కు 40 మార్కులు వస్తేనే ఉద్యోగులు తమ ప్రొబేషనరీకి అర్హత సాధిస్తారని ఏపీపీఎస్సీ పేర్కొంది. 

రెండేళ్ల సర్వీసు పూర్తవుతుండటంతో..
ఏపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రికార్డు స్థాయిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం విదితమే. అప్పుడు ఉద్యోగాలు సాధించిన వారంతా.. 2019 అక్టోబర్ 2వ తేదీన విధుల్లో చేరారు. ఈ ఉద్యోగులందరికీ రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌ 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల సర్వీసు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం వీరికి ప్రొబేషన్‌ డిక్లేర్ చేయడంతో పాటు పే స్కేలు అమలు చేయాలి. ఈ ప్రొబేషన్ డిక్లేర్ చేయడం కోసం శాఖాపరమైన (డిపార్ట్‌మెంట్) పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

1.34 లక్షల మంది.. 
ప్రస్తుతం ఏపీలో ఉన్న15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో  1.34 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా పని చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే విధుల నుంచి తొలగిస్తారనే వాదనలు కూడా వినిపించాయి. దీంతో వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పరీక్షలో ఎవరైనా ఉద్యోగులు పాస్ కాకపోతే ప్రొబేషన్ పీరియడ్ పొడిగిస్తారని.. పాస్ అయితే వారికి వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న ఏ ఒక్కరి ఉద్యోగం పోదని భరోసా ఇచ్చింది. 

Also Read: AP EDCET 2021: ఏపీ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఈ లింక్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి..

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget