అన్వేషించండి

AP PRC: జీతాల ప్రాసెస్ పై వీడని ఉత్కంఠ... ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం... డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ..

ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ జగడం ముదురుతోంది. తాజాగా ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. జీతాలు ప్రాసెస్ చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఎక్కడా తగ్గేదేలే అంటుంది. పీఆర్సీ జీవోలు రద్దు సాధ్యం కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై తాజాగా ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ఆదేశించింది. బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవన్న ప్రభుత్వం... బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను ఆదేశించింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపులు ప్రాసెస్ చేయాలని అధికారులను ఆదేశించింది. ట్రెజరీ సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కానీ ఉద్యోగులు మాత్రం తాము ప్రాసెస్ చేయబోమని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకూ కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయినట్లు తెలుస్తోంది.  మొత్తం 4.50 లక్షల బిల్లులు పాస్ చేస్తేనే ఉద్యోగులందరికీ జీతాలు వస్తాయి.  

పట్టువీడని ఉద్యోగ సంఘాలు

ఫిబ్రవరి 1వ తేదీ వస్తుండడంతో ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం అంటోంది. అయితే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అయితే తాజాగా ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పీఆర్సీపై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్న ఉద్యోగ సంఘాలు, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 

హెచ్ఆర్ఏ పెంపు 

మరో వైపు హెచ్ఆర్ఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హెచ్వోడీ కార్యాలయాల్లో హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన హెచ్వోడీ కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఈ హెచ్ఆర్ఏ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 

Also Read: 75 శాతం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ఉద్యోగులు.. ఇక ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget