అన్వేషించండి

CM Jagan: 'నాణ్యమైన విద్య మన హక్కు అనేదే కొత్త నినాదం' - ఎడెక్స్ తో ఒప్పందం సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh News: మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడితేనే భవిష్యత్తు మారుతుందని సీఎం జగన్ అన్నారు. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Government MOU With Edx Education Portal: 'రైట్ టు ఎడ్యుకేషన్' అనేది పాత నినాదమని.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది ఓ హక్కు అని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని పునరుద్ఘాటించారు. శుక్రవారం ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 'ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ఈ దేశంలో ఉన్న వారితో కాదు మన పోటీ. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి జీతాలు సంపాదించాలంటే నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం. అందుకోసం విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. ఈ ఒప్పందంతో దాదాపు 2 వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్ లైన్ లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. అనంతరం నిర్వహించే పరీక్షల్లో పిల్లలకు వచ్చిన క్రెడిట్స్ మన పాఠ్య ప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర యూనివర్శిటీల్లో అందుబాటులో లేని కోర్సులు సైతం ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది.' అని సీఎం వివరించారు.

సమూల మార్పులు

నాలుగున్నరేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. 'మొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. నాడు నేడుతో స్కూళ్ల రూపరేఖలు మార్చాం. పిల్లలను బడులకు తీసుకొచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. విద్యార్థులు పదో తరగతికి వచ్చే సరికి ఐబీ విద్యా విధానంలో బోధన  అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్థాయికి ఎదుగుతారు. 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ.. ఐఎఫ్ బీలను ప్రతి క్లాస్ రూంలో ఏర్పాటు చేస్తున్నాం. బైజూస్ కంటెంట్ అనుసంధానం చేశాం. ప్రతి ప్రభుత్వ స్కూల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ (ఓ పేజీ ఇంగ్లీష్, ఓ పేజీ తెలుగు) అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఏటా విద్యా సంవత్సరం జూన్ - జులైలోనూ అలాగే విద్యా సంవత్సరం చివర్లోనూ వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్య ప్రణాళికలో మార్పులు తెచ్చాం. దాాదాపు 30 శాతం స్కిల్ ఓరియెంటెడ్ గా మార్పులు చెందాయి.'  అని వివరించారు.

12 లక్షల మందికి లబ్ధి

ఏపీ ప్రభుత్వం 'ఎడెక్స్'తో ఒప్పందంతో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్శిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే 2 వేలకు పైగా ఎడెక్స్ ఆన్ లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటుగా ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్శిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుందని.. ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్శిటీలే ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయని పేర్కొన్నాయి.

Also Read: Who is Lokesh opponent in Mangalagiri : మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేసేది ఎవరు ? తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Kadapa Steel Plant: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Embed widget