అన్వేషించండి

YS Jagan: అవ్వాతాతల పింఛన్ అడ్డుకుంటున్న చంద్రబాబు మనిషా, శాడిస్టా? పూతలపట్టులో సీఎం జగన్ ఫైర్

Memantha Siddham meeting: దేశంలో రూ.3 వేలు పింఛన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Andhra Pradesh CM YS Jagan slams chandrababu over Pensions issue: పూతలపట్టు: వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి, సర్కార్ చేసిన మంచిని మరో 100 మందికి చెప్పాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను 130 సార్లు బటన్ నొక్కి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించానని, లబ్ధి పొందిన వారు ఎన్నికల్లో రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham Bus Yatra) బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని వ్యాఖ్యానించారు. 

YS Jagan: అవ్వాతాతల పింఛన్ అడ్డుకుంటున్న చంద్రబాబు మనిషా, శాడిస్టా? పూతలపట్టులో సీఎం జగన్ ఫైర్

జగన్ కొత్త నినాదం వైనాట్ 200 
నిన్న మొన్నటివరకూ వైనాట్ 175 అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు కొత్త నినాదం ఎత్తుకున్నారు. వైనాట్ 200 అంటూ వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లతో పాటు రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. జగన్ ఒక్కడు ఒకవైపు ఉంటే, తోడేళ్లు గుంపుగా మన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం ఒకవైపు ఉంటే.. మోసం, అన్యాయం, కుట్రలు మరోవైపు ఉన్నాయి. ప్రత్యేక హోదా సాధించని పార్టీ, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో చేతులు కలిపిందని టీడీపీపై విమర్శలు గుప్పించారు.

‘దేశంలో రూ.3వేల పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. అవ్వాతాతలు, పేదలు, అక్కాచెల్లెమ్మలను రక్షించుకునేందుకు మీరు సిద్ధా. మొత్తం 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్లు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. వాళ్లు అధికారంలోకి వస్తే ఇంటి వద్ద పింఛన్ ఇవ్వరు. అవ్వాతాతలను ఇబ్బంది పెడతారు. సంక్షేమ పథకాలు తొలగిస్తారు. చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని నేత. 2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. అయ్యిందా. డ్వాక్రా రుణమాఫి అని చెప్పి మోసం చేశాడు. ఇంటింటికి ఓ ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏ హామీని నెరవేర్చలేదు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు ఒక్క స్కీమ్‌ కూడా గుర్తురాదు. మే 13న జరగబోయే ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్‌ ఆధారపడి ఉంది.’ అని సీఎం జగన్‌ అన్నారు.

సూర్యుడు ఉదయించముందే ఒకటో తేదీన వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి అవ్వాతాతలకు, లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేవాళ్లు అని జగన్ గుర్తుచేశారు. అవ్వాతాతల బాధలు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుందన్నారు. తన మనుషులతో ఈసీకి లేఖ రాయించి వాలంటీర్లు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget