అన్వేషించండి

Badvel By Election: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ సమావేశం... గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం... అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని ఆదేశం

బద్దేలు ఉపఎన్నికపై సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. ప్రతి ఇంటికి మూడు నాలుగు సార్లు వెళ్లాలన్నారు.

బద్వేలు ఉప ఎన్నికపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెసీలు, పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. 2019లో దాదాపు 44 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ అన్నారు. గత ఎన్నికల్లో దివంగత దాసరి వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ డాక్టర్‌ సుధకి రావాలని సీఎం అన్నారు. అతి విశ్వాసానికి పోకుండా, ప్రజల ఆమోదాన్ని పొందాలన్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందన్న సీఎం.. ఈ సారి ఓటింగ్‌ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓటు హక్కు వినియోగించకునేలా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలన్న సీఎం జగన్... మండలాన్ని ఒక బాధ్యుడికి అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలన్నారు. 


Badvel By Election: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ సమావేశం... గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం... అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని ఆదేశం

Also Read: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..

పార్టీ ఇంఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి

గ్రామాల్లో విసృతంగా పర్యటించి ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లాలని సీఎం జగన్‌ అన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్యపరచాలని నేతలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. నెల రోజుల పాటు నాయకులందరూ ఎన్నికపై దృష్టిపెట్టాలన్నారు. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని సీఎం జగన్ అన్నారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్దేశించారు.


Badvel By Election: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ సమావేశం... గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం... అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని ఆదేశం

Also Read: బద్వేల్‌ గురించి మర్చిపోయిన రాజకీయ పార్టీలు.. ఉపఎన్నిక ఉంటుందా.. లేక ఏకగ్రీవమేనా..

వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ

ఈ సమావేశంలో మంత్రులు అంజాద్‌ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొ్న్నారు. బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ నెల 8వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్‌ 30న పోలింగ్‌, నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2019 జనరల్ ఎలక్షన్ లో వైసీపీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget