అన్వేషించండి

CM Jagan : గురువారం ఢిల్లీకి సీఎం జగన్ - అధికారిక షెడ్యూల్ ఇదే!

ఏపీ సీఎం జగన్ గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని, హోంమంత్రులతో సమావేశంపై స్పష్టత రావాల్సి ఉంది.


 
CM Jagan To Delhi :   ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురు, శుక్రవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఐదో తేదీన ఉదయం  10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ 1 జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బస చేస్తారు. మరి ఐదో తేదీ అంతా ఎవర్ని కలుస్తారు అన్నది స్పష్టత లేదు. ఆరో దేతీదన  ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్‌ నివాసం నుంచి విజ్ఞాన్‌ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులతో లేదా ప్రధానమంత్రితో సమవేశాల గురించి అధికారికంగా స్పష్టత లేదు. ప్రధాని, హోంమంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తునారు. వారి అపాయింట్మెంట్ల కోసం ఏపీ భవన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వవర్గాలు చెబుతున్నాయి.   ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం  జగన్ ఢిల్లీ  వెళ్లాలనుకున్నారు. కానీ అప్పట్ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో వెళ్లలేదు.ఇప్పుడు హోంశాఖ సమీక్ష ఉండటంతో ఢిల్లీకి వెళ్తున్నారు.  ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది.   ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సైతం.. అక్టోబర్ నెలలోనే వస్తుండటం.. అది కూడా ఆరు నుంచి ఏనిమిదో తేదీ మధ్యన రిలీజ్ కావొచ్చనే సమాచారం వస్తున్న క్రమంలోనే.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు కావడంతో మరోసారి చర్చ ప్రారంభమయింది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ అసెంబ్లీ రద్దు చేసి.. రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.                  

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏడు నెలల ముందు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటంతో.. ఎన్నికలతోపాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోదీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.                                 

మరో వైపు  ఏపీ ప్రభుత్వం తీవ్రమైన  నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా.. నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల  కోట్లు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ నిధుల సమీకరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. పది వేల కోట్ల వరకూ ఇస్తారని భావిస్తున్నారు. మరికొన్ని అంశాల్లోనూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తులు చేసే అవకాశం ఉంది.        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget