అన్వేషించండి

Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

New Sports Policy: రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ పాలసీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

AP Government Approves New Sports Policy: ఏపీ ప్రభుత్వం క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆమోదం తెలిపారు. స్పోర్ట్స్ పాలసీపై సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా (Sports Policy) ఏపీ నూతన పాలసీ కావాలని.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో ఈ విధానం రూపొందించినట్లు సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతల ప్రోత్సాహకాన్ని సైతం భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు, సీఎస్ నీరబ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతకు ముందు స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్రీడా విధానాన్ని రూపొందించిన అధికారులు దీనిపై సీఎం చంద్రబాబుకు వివరించారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు. అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచస్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్ట్స్ టూరిజం వంటి అంశాలకు పాలసీలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో క్రీడా కోటా రిజర్వేషన్ పెంపు సహా యూనిఫాం సర్వీసెస్‌లో 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. శాప్‌లో గ్రేడ్ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

వారికి భారీగా ప్రోత్సాహకాలు

పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే వారికి మరింత ప్రోత్సాహంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ ఇతర అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించే వారికి అందించే ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే వారికి ఇచ్చే ప్రోత్సహకాన్ని రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. రజత పతకం సాధించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచారు. అలాగే, ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.4 కోట్లు, రజత పతకం సాధిస్తే రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే రూ.కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు.

'స్పోర్ట్స్ సిటీగా అమరావతి'

స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడం సహా తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలి. మండల, నియోజకవర్గ స్థాయిల్లో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సంప్రదాయ క్రీడలు ప్రోత్సహించాలి. మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్, నేచర్ ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ వంటివి ఏర్పాటు చేయాలి.' అని సీఎం అధికారులకు సూచించారు. 

Also Read: YS Vijayamma: వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ - జగన్‌కు ఊరట కల్పించే విషయమే !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget