అన్వేషించండి

Chandrababu: ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముంది, అలర్ట్ గా ఉండాలి - చంద్రబాబు కీలక సూచనలు

AP Rains: విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఫ్లాష్ ఫుడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

Rains in Andhra Pradesh | ఏపీలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఈసారి ఉత్తరాంధ్రపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. ముందుగానే ఆయా జిల్లాల అధికారుల్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఇటు విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.

ఉత్తరాంధ్రలో వరదలకు అవకాశం

ఈసారి వర్షాలు, వరదల ప్రభావం ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉండే అవకాశముందని చెప్పారు సీఎం చంద్రబాబు. అల్లూరి జిల్లాకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, దానికి అనుగుణంగా ఆ జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని ఆయన చెప్పారు. అటు విశాఖలో కొండ చరియలు విరిగి పడుతుండటంతో అక్కడ కూడా అధికారుల్ని అప్రమత్తం చేశామని, కొండ వాలు ప్రాంతంలోని ఇళ్లను ఖాళీ చేయించామని చెప్పారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాలకు నష్టం వాటిల్లకుండా అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వరకు ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ముఖ్యంగా అల్లూరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేందుకు ఛాన్స్ లు ఉన్నాయని అన్నారు. 

గవర్నర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఆదివారం ఉదయం రాష్ట్ర గవర్నర్ ని కలిసి, వరద సహాయక చర్యల గురించి వివరించామని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న సహాయక కార్యక్రమాల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో 97 లక్షల మందికి భోజనం అందించామని చెప్పారు చంద్రబాబు. 94 లక్షల వాటర్ బాటిల్స్ ని వారికి చేర్చామన్నారు. 28 లక్షల లీటర్ల పాలు, 41 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లు బాధితులకు ఇచ్చి వారి ఆకలి తీర్చామన్నారు. 1.10 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశామన్నారు. 3 లక్షల క్యాండిల్స్, 1.9 లక్షల అగ్గిపెట్టెలు సరఫరా చేశామన్నారు. మొత్తంగా 163 మెట్రిక్ టన్నుల కూరగాయలను వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించామని, 2090 సార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేశామన్నారు. ఇక బురదతో ఇబ్బందిపడుతున్నవారికి కూడా ప్రభుత్వం సాంత్వన చేకూర్చిందన్నారు సీఎం. ఫైర్ ఇంజిన్ల ద్వారా 27 వేల ఇళ్లు శుభ్రం చేయించామన్నారు. 

వరదలు మొదలై ఎనిమిది రోజులు గడుస్తున్నా కూడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 0.51 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, వాటన్నిటినీ బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రోడ్లపై బురద పేరుకుపోకుండా చేస్తున్నామని, ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. వర్షాలు, వరదల కారణంగా బైక్ లు, ఆటోలు, కార్లు పాడైపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీవీలు, ఫ్రిజ్ లు, మిక్సీలు.. ఇలాంటి గృహోపకరణాలు కూడా పాడైపోయాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

Also Read: ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుంటాడు - యూట్యూబ్ ఛానెళ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కృష్ణానదికి వరద వచ్చిందని, వాతావరణంలో పెను మార్పులు దీనికి కారణం అని అధికారులు, నిపుణులు చెబుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. బుడమేరు కబ్జాల వల్ల వరదనీరు లోతట్టు ప్రాంతాలకు చేరిందని, లక్షలమంది ఇబ్బంది పడ్డారని అన్నారాయన. భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు లేకుడా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు

Also Read: ఒవైసి కాలేజీ ఎప్పుడు కూల్చుతారు? రేవంత్ రెడ్డి భయపడ్డారా ! లేక రాజీపడ్డారా?: రాజాసింగ్ సంచలనం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget