News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Andhra BJP : విశాఖలో అమిత్ షా బహిరంగసభ - గేర్ మారుస్తున్న ఏపీ బీజేపీ !

ఏపీలో బీజేపీ గేర్ మారుస్తోంది. వరుసగా మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతలు బహిరంగసభలు పెట్టబోతున్నారు.

FOLLOW US: 
Share:

 

Andhra BJP :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు.  హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెరో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం రానున్నారు. విశాఖలో మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. తిరుపతిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు.                        
 
ఆంధ్రప్రదేశ్  బీజేపీపై దృష్టి పెట్టాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారని అందుకే ఇద్దరు అగ్రనేతలు మూడు రోజులగా ఏపీలో పర్యటిస్తున్నారని భావిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ విషయంలో చాలా సమావేశాలు నిర్వహిస్తోంది కానీ..ఇంకా ఏపీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో వ్యూహాలు ఖరారు చేయడం లేదు. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో బీజేపీతో పొత్తుల కోసం రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అంతా ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందని చెబుతున్నారు కానీ రాష్ట్ర నేతలకు పెద్దగా సమాచారం ఉండటం లేదు. పొత్తుల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని..  వారు ఏం చెబితే దాన్ని పాటిస్తామని రాష్ట్ర నేతలు అంటున్నారు. ఇప్పటికే తాము జనసేనతో మాత్రమే ఉన్నామంటున్నారు. 

ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ నిర్దేశించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. గతంలో ఆరేడు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించిన  బీజేపీ.. ఇటీవల ప్రజా చార్జిషీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వ విజయాలను కూడా ప్రచారం చేశారు. తాజాగా .. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 9 ఏళ్లయిన సందర్భంగా నవ వసంతాలు - నవ కుసుమాల పేరిట తొమ్మిది విజయాలను భారీ స్థాయిలో ప్రచారం  చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం నెల రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.                              

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గత నెల 30 వతేదీ నుంచి ఈ ప్రచారం ప్రారంభమయింది. జిల్లాల వారీగా బహింగసభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో రెండు జిల్లాల బహిరంగసభలకు పార్టీ అగ్రనాయకత్వం వస్తూండటంతో.. బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది.                                                                      

 

Published at : 02 Jun 2023 04:08 PM (IST) Tags: AP Politics Vishnuvardhan Reddy AP BJP Somu Veerraju Amit Shah Sabha in Visakhapatnam

ఇవి కూడా చూడండి

TDP leader Anita: మహానటి రోజాను చూస్తే నవ్వొస్తోంది-టీడీపీ నేత అనిత కౌంటర్‌

TDP leader Anita: మహానటి రోజాను చూస్తే నవ్వొస్తోంది-టీడీపీ నేత అనిత కౌంటర్‌

పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీస్‌- ఆధారాలు సమర్పించాలని ఆదేశం

పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీస్‌- ఆధారాలు సమర్పించాలని ఆదేశం

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

AP BJP: చంద్రబాబు అరెస్ట్‌, పవన్‌ పొత్తు ప్రకటనపై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి- కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం

AP BJP: చంద్రబాబు అరెస్ట్‌, పవన్‌ పొత్తు ప్రకటనపై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి- కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

టాప్ స్టోరీస్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్‌ సస్పెన్సన్‌ తాత్కాలికంగా రద్దు

Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్‌ సస్పెన్సన్‌ తాత్కాలికంగా రద్దు

హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు

హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు