అన్వేషించండి

AP Assembly Session: ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం

AP Budget Session 2026 | ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల తరువాత నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించనున్నారు. 3 కీలక బిల్లులు సభకు రానున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత బడ్జెట్‌పై సాధారణ చర్చ నేడు మొదలుకానుంది. ప్రభుత్వం నేడు మూడు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. మున్సిపల్ చట్టాల్లో రెండు సవరణ బిల్లులను మంత్రి నారాయణ, విద్యుత్ సుంకం సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభ ముందు ఉంచనున్నారు. మధ్యాహ్నం నుండి బడ్జెట్‌పై సమగ్ర చర్చ ప్రారంభమవుతుంది.

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌పై ప్రసంగించనుండగా, ఎల్లుండి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీలో తొలుత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈ సెషన్‌లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా 2019-24 మధ్య కాలంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో జరిగిన పనుల్లో అవకతవకలు, స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి అక్రమ రవాణా అరికట్టడం వంటి అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. అలాగే ఆక్వా రైతులందరికీ ఏకరీతి విద్యుత్ రాయితీ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల పునర్నిర్మాణం, హజ్ యాత్రికుల సమస్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సభలో చర్చించనున్నారు.

మరోవైపు, ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న శాసనమండలిలో కూడా బడ్జెట్‌పై తొలిరోజు చర్చ జరగనుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆడబిడ్డ నిధి పథకం అమలు, యురేనియం గనుల తవ్వకం వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆసుపత్రుల్లో మందుల నాణ్యత, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం వంటి ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపై మండలిలో మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
Andhra Pradesh Top News: పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, అక్టోబర్ 1 నుంచి 2 డీఏలకు ఆమోదం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
PRC ఏర్పాటుకు నిర్ణయం, అక్టోబర్ 1 నుంచి 2 డీఏలకు ఆమోదం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
AP Zilla Parishads: ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు.. జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటుకు ఉత్తర్వులు
ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు.. జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటుకు ఉత్తర్వులు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget