By: ABP Desam | Updated at : 24 Feb 2023 03:13 PM (IST)
మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - బడ్జెట్ పెట్టేది ఎప్పుడంటే ?
AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను మార్చి 14 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. .కొన్ని కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మాట్లాడనున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి... బడ్జెట్ ఎప్పుడు పెడతారు అనేది బీఏసీ లో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా మూడు రాజధానుల అంశం చర్చకు వస్తుంది. ఈ సారి కూడా సీఎం జగన్ మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లిలో ప్రకటన చేయనున్నారు.
అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానులు... రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి . సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది...ఎన్నికలకు ముందు జరిగే బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ సారి కొన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.....వ్యవసాయ విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నట్లుా తెలుస్తోంది. ఏపీ రెవెన్యూ ఆశించినంతగా లేకపోవడంతో కేంద్ర పన్నుల వాటాపైనే రాష్ట్రప్రభుత్వం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినా సంక్షేమ పథకాలకు కేటాయింపుల్లో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదంటుంది.
ఈ సారి బడ్జెట్లో మళ్లీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తారా లేక పన్నుల ప్రతిపాదిస్తారా అని వేచిచూడాల్సి ఉంది. అలాగే ఆదాయ మార్గాల అన్వేషణపై కూడా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ లో ముఖ్యంగా నవరత్నాల పేరుతో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపేట వేసే అవకాశం ఉంది. వీటితో పాటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కేటాయింపులు పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తవాటికి ఏమైనా కేటాయింపులు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాది కావడంతో.. బడ్జెట్ ఖరారు చేయడం ఆర్థిక శాఖ అధికారులకు సవాల్గామారింది.
అసెంబ్లీలో ఈ సారి కూడా టీడీపీ కూడా కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీ లో చర్చ లెవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది.... పెరిగిన ధరలు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇతర అంశాలపై టీడీపీ చర్చ కు పట్టు బట్టే అవకాశాలు ఉన్నాయి .....మొత్తానికి కొంత వాడి వేడిగా నే ఈ సారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయి.
Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
Mlc Dokka Vara Prasad : సస్పెండ్ చేయగానే టీడీపీ నినాదం, ఇంతకన్నా ఫ్రూప్ ఏంకావాలి- ఉండవల్లి శ్రీదేవికి డొక్కా కౌంటర్
MLA Maddali Giridhar: "క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు నన్నూ సంప్రదించారు, కావాలంటే కాల్ డేటా చూడండి"
Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!