అన్వేషించండి

Breaking News: ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వైఎస్ విజయమ్మ.. బాధితులను ఓదార్చుతూ కంటతడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News: ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వైఎస్ విజయమ్మ.. బాధితులను ఓదార్చుతూ కంటతడి

Background

కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

22:35 PM (IST)  •  15 Sep 2021

వైఎస్ విజయమ్మ పరామర్శ

సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. బుధవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన విజయమ్మ వారిని ఓదార్చారు. అఘాయిత్యంపై చలించిన విజయమ్మ వారి ఎదుటే భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆ వీధి చివరే వైఎస్ షర్మిల దీక్ష చేస్తుండగా.. అక్కడికి వెళ్లి ఆమెతో పాటు దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.

22:33 PM (IST)  •  15 Sep 2021

ఇప్పటిదాకా 76 కోట్ల వ్యాక్సిన్ డోసులు

భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం 76 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు ఒక్కరోజే 57 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా వెల్లడించింది.

20:50 PM (IST)  •  15 Sep 2021

5G spectrum auctions: వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లో 5G స్పెక్ట్రమ్‌ వేలం ఉండే ఛాన్స్‌

5G స్పెక్ట్రమ్‌ వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగొచ్చని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. జనవరికి మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. 

20:50 PM (IST)  •  15 Sep 2021

నంద్యాలలో దారుణ హత్య

కర్నూలు జిల్లా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని మర్చంట్ జనరల్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకట సుబ్బయ్యగా గుర్తించారు. ప్రత్యర్థులు అతణ్ని వేటకొడవళ్ళతో నరికి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు.

17:48 PM (IST)  •  15 Sep 2021

సీఎం జగన్‌తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సమావేశం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మర్యాదకపూర్వకంగా సమావేశమైనట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. 

17:30 PM (IST)  •  15 Sep 2021

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ముగిసిన నటి ముమై‌త్ ఖాన్ విచారణ.. బ్యాంకు ఖాతా, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ముమై‌త్ ఖాన్ విచారణ ముగిసింది. బుధవారం నాడు ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటలపాటు ముమైత్ ఖాన్‌ను బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. తనకు ముంబైలో రెండు బ్యాంకు ఖాతాలున్నాయని ఈడీ అధికారులకు ముమైత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడు కెల్విన్ తో సంబంధాలపై ముమైన్‌ను ఈడీ ప్రశ్నించింది.

16:06 PM (IST)  •  15 Sep 2021

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యులు వీళ్లే

టిటిడి పాలకమండలి సభ్యులు

  1. పోలకల అశోక్ కుమార్ 
  2. మల్లాడి క్రిష్ణారావు
  3. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
  4. కాటసాని రాంభూపాల్‌రెడ్డి
  5. గొర్ల బాబురావు
  6. మధుసూదన్ యాదవ్
  7. జీవన్‌ రెడ్డి, 
  8. జూపల్లి రామేశ్వరావు
  9. లక్ష్మినారాయణ
  10. పార్దసారథి రెడ్డి
  11. మూరంశెట్టి రాములు
  12. కల్వకుర్తి విద్యాసాగర్
  13. రాజేశ్‌ శర్మ 
  14. నందకుమార్
  15. శంకర్
  16. శశిధర్ రెడ్డి
  17. విశ్వనాథ్‌రెడ్డి
  18. కన్నయ్య
  19. కేతన్ దేశాయ్
  20. మిలింద్
  21. శ్రీనివాసన్‌
  22. మారుతి
  23. సౌరబ్‌
15:33 PM (IST)  •  15 Sep 2021

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. రామన్నపేట శివారులోని డిగ్రీ కాలేజ్ సమీపాన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

15:18 PM (IST)  •  15 Sep 2021

సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్​ షర్మిల దీక్ష


సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్​ షర్మిల దీక్షకు కూర్చున్నారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. అందరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా... నిందితున్ని పట్టుకోకపోవటంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధిత కుటుంబంతో కలిసి దీక్ష ప్రారంభించారు. హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే.. ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

15:00 PM (IST)  •  15 Sep 2021

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్ కొట్టివేత

సీబీఐ కోర్టులో ఎంపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్ వాదనలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేయడంతో ఏపీ సీఎంకు ఊరట లభించింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget