Breaking News Live: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన మోదుగుల దుర్గా ప్రసాద్, గుంటూరుకు చెందిన ఆమడ అరవింద్లు తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సరదాగా గడిపిన యువకులు.. సాయంత్రం కృష్ణానదిని చూసేందుకు బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈత రాకపోవడంతో నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, వారి కుటుంబసభ్యులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్ల సాయంతో పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. అరవింద్ మృతదేహం లభ్యం కాగా, దుర్గా ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కొద్దిసేపు స్తంభించిపోయాయి. కొన్ని నిమిషాల నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
ముంబయి డ్రగ్స్ కేసు... ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణ
ముంబయి డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ముంబై ఎస్పలాండె కోర్టు బెయిల్ నిరాకరించింది. మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఆర్యన్ ఖాన్, అర్బజ్ సేత్ మర్చంట్, మున్ మున్ ధామేచా కు అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీకి అంగీకరించింది.





















