అన్వేషించండి

AP Government: జగనన్న ఇళ్లకు రాయితీ మీద బల్బులు, ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు- ఈఈఎస్‌ఎల్‌తో ప్రభుత్వం ఒప్పందం

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కంపెనీ లిమిటెడ్  ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కంపెనీ లిమిటెడ్  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శనివారం గోవాలో G20 క్లీన్ ఎనర్జీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తున్న ఇళ్లకు విద్యుత్‌ ఆదా ఉపకరణాలను మార్కెట్‌ ధర కంటే తక్కువకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)తో ఒప్పందం చేసుకుంది. 

'నవరత్నాలు-పెదలందరికీ ఇల్లు' పథకం కింద జగనన్న కాలనీల గృహ లబ్ధిదారులకు మొదటి దశలో 6 లక్షల ఎల్‌ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేసేలా రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ మేరకు ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్‌ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీ ధరలకు ప్రభుత్వం అందించనుంది. హౌసింగ్ స్కీమ్‌లో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లలో ఈ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా అధికారులు వేస్తున్నారు. ఏడాదికి ప్రతి ఇంటికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా వినియోగదాలకు ఏడాదికి రూ. 2,259 ఆదా అవుతుందని అంచనా వేశారు.

పలువురు అగ్రనేతలు, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమ నిపుణుల సమక్షంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హౌసింగ్) అజయ్ జైన్, EESL CEO విశాల్ కపూర్ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అనంతరం అజయ్ జైన్ మాట్లాడుతూ.. ‘నవ రత్నాలు - పేదలందరికీ ఇల్లు' లబ్ధిదారులకు అత్యున్నత నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడిన, ఇంధన ఉపకరణాలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

లబ్ధిదారులకు విద్యుత్తు బిల్లుల భారం తగ్గించడంతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షించడమే ఈ ఒప్పంద లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు ఆధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన ఇంధన వనరులు అందించడంతోపాటు అత్యున్నత నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారని జైన్ వివరించారు. తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుని సమర్థవంతంగా పనిచేయడంలో ఈ ఉపకరణాలు మెరుగ్గా పనిచేస్తాయన్నారు. ఈ ఒప్పందం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. 

ఈఈఎస్‌ఎల్‌, ఏపీ గృహనిర్మాణ శాఖ మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందని ఈఈఎస్‌ఎల్‌ సీఈవో విశాల్‌ కపూర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన భవిష్యత్తును సృష్టించాలనే రాష్ట్ర నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఆధునిక, ఇంధన - సమర్థవంతమైనవాటిని భారీ స్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందన్నారు. సుస్థిర ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. 

దక్షిణ ప్రభుత్వ వ్యవహారాల EESL సీనియర్ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధనలో ఇంధన సామర్థ్య గృహ ప్రాజెక్ట్ ఒప్పందం ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది త్వరలో రాష్ట్రంలోని ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని రెడ్డి అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget