అన్వేషించండి

Input Subsidy For Farmers: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బు

Election Commission: ఎన్నికల నేపథ్యంలో డీబీటీ పథకాల చెల్లింపులపై విధించిన ఆంక్షలను ఈసీ ఎత్తివేసింది. దీంతో శనివారం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

AP News: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచాంగ్ తుపాన్ పంట నష్ట పరిహారం (ఇన్ పుట్ సబ్సిడీ)ను రైతుల ఖాతాల్లో జమచేయనుంది. ఎన్నికల నేపథ్యంలో డీబీటీ పథకాల చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పథకాలపై ఈసీ ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో శనివారం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో నిధుల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

103 కరువు మండలాలు
గత ఏడాది దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌ సాగుపై తీవ్ర ప్రభావం పడింది.  సాగు విస్తీర్ణం, వర్షపాతం, వాగు ప్రవాహం, భూగర్భ జల స్థాయిలు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి అంశాల ప్రామాణికాల ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఏడు జిల్లాల్లో  మొత్తం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నిబంధనల మేరకు 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఉద్యాన పంటలు 92,137 ఎకరాలు, వ్యవసాయ పంటలు 19,32,108 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. 

ఆర్టీకేల్లో అర్హుల జాబితా
2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ రాష్ట్రాన్ని అతాలకుతలం చేసింది. భారీ వర్షాలతో 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  ఉద్యాన పంటలు 64,695 ఎకరాల్లో, వ్యవసాయ పంటలు 5,99,685 ఎకరాలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్ పంటలు నష్టపోయిన 6,95,897 మంది రైతులకు రూ.847.22 కోట్లు, మిచాంగ్ తుఫాన్‌తో పంట నష్టపోయిన 4,61,337 మంది రైతులకు రూ.442.36 కోట్లు.. మొత్తం మీద 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు పెట్టుబడి రాయితీ అందించనున్నారు. ఈ మేరకు స్థానిక సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో  అర్హుల జాబితాలను ప్రదర్శించారు.

ఎన్నికల నేపథ్యంలో ఆగిన నిధులు
కరువు సాయం, మిచాంగ్ తుపాన్ పరిహారం గత మార్చిలోనే జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్ రావడంతో డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. పోలింగ్ ముగిసే వరకు డీబీటీ చెల్లింపులు చేయోద్దని ఈసీ ఆదేశించింది. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో మే 10వ తేదీన జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల కమిషన్ మరోసారి ప్రశ్నలు సంధించడంతో  నిధులు జమ కాలేదు. 

తాజాగా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కమిషన్ ఆంక్షలను సడలించింది. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు మూడు రోజుల్లో 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా మొత్తంతో కలిపి ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు రూ.3,261.60 కోట్లు పెట్టు బడి రాయితీగా అందించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. 

టాప్ హెడ్ లైన్స్

Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget