అన్వేషించండి

Anantapur Urban: వైసీపీ టికెట్ రేసులో ఇద్దరు నేతలు, కలవరపడిపోతున్న ఎమ్మెల్యే

Anantapur Politics: ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో అనంతపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Anantapur News: అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ పై రోజు రోజుకి పోటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసిపి టికెట్ కు ఎవరూ పోటీలో లేరనుకున్నారు. కానీ ఒక్కరోజులో సీన్ మారిపోయింది. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్బంగా ఆశావహులు తామే టికెట్ రేసులో ఉన్నామని చెప్పకనే చెప్పేశారు. దీంతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వేంకటరామి రెడ్డికి కలవరం మొదలైంది. ఇంతకీ ఎవరు ఆ వ్యాఖ్యలు చేశారంటే..

ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో అనంతపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాని నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు హడావుడితో అనంతపురం జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగింది. ఆయన పై ఎలాంటి వ్యతిరేకతలు లేవు. నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరు నేతలు తెరపైకి రావడం ఒక్కసారిగా రాజకీయాల్ని వేడెక్కించాయి. సీఎం జగన్ జన్మదిన వేడుకలను వారు వేదికగా చేసుకొని బల ప్రదర్శనకు దిగారు. వారిలో ఒకరు అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ మరొకరు ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్.

ఈ ఇద్దరు నాయకులు ఒకప్పుడు తెలుగుదేశం నేతలు. తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించి నిరాశపడి చేసేది లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జిగా చాలా రోజులపాటు పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతపురం చోటు చేసుకున్న పరినామాలతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహాలక్ష్మి శ్రీనివాస్ పోటీ చేశారు. అ ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గెలుపొందాడు. 2014 ఎన్నికలకు ఆయన పూర్తిస్థాయిలో సిద్ధమైన తరుణంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టీడీపీ టికెట్ వచ్చింది. దీంతో మనస్థాపంతో మహాలక్ష్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 వరకు ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. కానీ 2019 ఎన్నికల్లో దాదాపు టికెట్ వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ చివరి క్షణంలో ఆ టికెట్ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి వచ్చింది. 

దీంతో నిరుత్సహపడకుండా కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ రేసులో నిలిచారు. కానీ ఆ పదవి మరొకరికి పోయింది. దీంతో అసంతృప్తిగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్ కు అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) చైర్మన్ గా అవకాశం కల్పించారు. రెండేళ్ల  తర్వాత కూడా ఆయనకు ఆ పదవిని కొనసాగించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నగరంలో కనివిని ఎరుగని రీతిలో ఫ్లెక్సీలు, హోర్గింగులతో హోరెత్తించారు. వందలాది మంది యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఒక భారీ కటౌట్ కు క్రేన్ సాయంతో పాలాభిషేకం చేసి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఇదంతా చేస్తున్నది ఆయన టికెట్ కోసమేనని అంతా భావిస్తున్నారు.

మరోవైపు ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీం విషయంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. కానీ టిడిపి లో ఉండలెక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. 2014, 19 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ కోసం ట్రై చేశారు. అయితే నదీమ్ సేవలను గుర్తించిన సీఎం జగన్ ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా అవకాశమిచ్చారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నధీమ్ కూడా నగరంలో భారీ హోర్డింగులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు నేతలు టికెట్ రేసులో ఉన్న కారణంగానే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. 

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు మైనార్టీలవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కోటాలో టికెట్ సాధించాలని నదీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారుగా 60 వేల ఓట్లకు పైగా  మైనార్టీలవి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మైనారిటీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. అందుకే నదీం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా సామాజిక వర్గ ఈక్వేషన్స్ తోనే తెరపైకి వచ్చారు. మైనారిటీల తర్వాత అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. సుమారుగా 45 వేల ఓట్ల వరకు వీరివి ఉన్నాయి. నేపథ్యంలో ఈసారి కచ్చితంగా బలిజలకే టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు పార్టీల్లోనూ ఉంది. అందుకే మహాలక్ష్మి శ్రీనివాస్ చివరి నిమిషంలో తెరపైకి వచ్చారు.

జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వేదికగా చేసుకొని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వర్గీయులు కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎక్కడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఓటింగ్ లు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయలేదు. కానీ టికెట్ రేసులో ఉన్న ఈ ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget