అన్వేషించండి

Anantapur News: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

అనంతపురంలో విద్యార్థులపై లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎయిడెడ్ కళాశాల విలీనం ఆపాలని ఎస్ఎస్బీఎన్ కళాశాల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని విద్యార్థి సంఘాలు ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య సుమారు గంటపాటు తోపులాట జరిగింది.  ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొంతమంది రాళ్లు రువ్వారు.  దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి వాహనంలో తరిలిస్తుండగా పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు.  

లాఠీఛార్జ్ చేయలేదు : డీఎస్పీ

చదువుకునే విద్యార్థులపై ప్రతాపం చూపుతారా? అంటూ పోలీసులను విద్యార్థులను నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసే క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో గుర్తుతెలియని వ్యక్తులు విసిరిన రాయి తగిలి జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయం అయ్యింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మాత్రం లాఠీఛార్జ్ చేయలేదని చెప్తున్నారు. గుంపులను మాత్రమే చెదరగొట్టమని డీఎస్పీ వీరరాఘవ రెడ్డి వెల్లడించారు. 

Also Read: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు

నిరసన తెలపడం కూడా నేరామేనా : లోకేశ్

అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎయిడెడ్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని విమర్శించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయమన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Also Read: కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి

విద్యార్థులపై పోలీసు జులుం చూపిస్తారా..? 

అనంత విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అధికార మత్తులో విద్యార్థుల ఆందోళనలు భరించలేకపోతున్నారని విమర్శించారు. విద్యార్థులప్తె విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఏమి రాజకీయాలు ఉంటాయని, తమ భవిష్యుత్తు కోసం ఆందోళనపడుతున్న విద్యార్థులను లాఠీలతో చెదరగొట్టడం అమానుషమన్నారు. 
అనంతపురం విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషమన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండకూడదన్నారు. 

Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Google AI Hub Issue: గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget