అన్వేషించండి

టీడీపీ హయాంలో ఒకే వర్గానికి ప్రాధాన్యత, జగన్ పాలనలో నాయీ బ్రాహ్మణులకు మేలు!

వెనకబడిన వర్గాలకు మేలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది అన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

వెనకబడిన వర్గాలకు మేలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది అన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జరిగిన నాయీ బ్రాహ్మణ ధన్యవాదాలు సభకు సజ్జల మంత్రులు జోగి  రమేష్, కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల్ హాజరయ్యారు. నాయీ బ్రాహ్మణులను చట్ట సభలోకి అడుగు పెట్టేలా జగన్ చేస్తారన్నారు మంత్రి  జోగి రమేష్.  
తాడేపల్లిలో నాయీ బ్రాహ్మణ కృతజ్ఞతా సభ...
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణుల కృతజ్ఞతా సభ జరిగింది. ఈ సభకు హాజరయిన బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అన్ని ఆలయాల పాలక మండలిలో స్థానం కల్పించటంపై నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆలయాలలో పనిచేసే వారికి రూ.20వేలు వేతనం అందిస్తున్న జగన్ తమకు అన్ని విధాలుగా మేలు చేసేందుకు నిత్యం పరితపిస్తున్నారని అన్నారు. తమకు పలు రకాలుగా మేలు చేసిన జగన్ ప్రభుత్వం, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ ఏర్పాటు చేశామన్నారు.
అప్పుడు ఆ సామాజిక వర్గానికే న్యాయం...
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఒక సామాజిక వర్గం తప్ప మరెవరూ బాగు పడలేదన్నారు. కుల వృత్తులు చేసుకునే వారు తమ సమస్యలు పరిష్కారించమని చంద్రబాబును కోరితే, మీ తోకలు కత్తిరిస్తామంటూ చంద్రబాబు బెదిరించారని గుర్తు చేశారు. ఇవే సమస్యలు జగన్ కి చెప్తే ఎంతో సానుకూలంగా స్పందించారని అన్నారు. ఎంత వీలైతే అంత మేలు చేయాలని నాకు సీఎం చెప్పారని, జీవో 110 ద్వారా నాయీ బ్రాహ్మణులకు మేలు చేయగలిగామని చెప్పారు. ముకేష్ అంబానీ లాంటి వాళ్లు సెలూన్ బిజినెస్ చేస్తున్నారని, నాయీ బ్రాహ్మణులు మరింత సమర్ధవంతంగా పని చేయాలన్నారు. పోటీని ఎదుర్కొని నిలపడాలని సూచించారు. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలపెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు.
బీసీ అంటే వైసీపీనే...
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అన్నివిధాలా అండగా నిలిచారని వివరించారు. బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయో కూడా తెలియని మనకి రాజకీయంగా నిలపెట్టారని, నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తారని, అది కూడ త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దమ్ము, ధైర్యం కేవలం జగన్ కే సాధ్యమని, సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాలు చూశారని, అందుకే అనేక సంక్షేమ పథకాలు తెచ్చి అండగా నిలిచారని వివరించారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని, చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపుని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవహేళన చేశారని, ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు, కంబళ్లు ఇచ్చి ఇక మీకు చాల్లే అంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ కారణంగా బీసీల పిల్లలు నేడు పెద్దపెద్ద చదువులు చదువుతున్నారని, ఆలయాల పాలక మండలిలో సైతం నాయీ బ్రాహ్మణులు సభ్యులయ్యారని వివరించారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ బీసీలకు మరిత ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహం లేదని, వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలకు అధికంగా సీట్లను కేటాయించటం కూడా జగన్ కే సాధ్యం అవుతుందన్నారు. జగన్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే, కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి, అన్ని పదవులను బీసీలకు ఇచ్చిన చరిత్ర జగన్ దేనని వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget