అన్వేషించండి

Vijayasai Reddy: 2024 తర్వాత టీడీపీ అంతర్థానం గ్యారంటీ - విజయసాయిరెడ్డి ఎద్దేవా

గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 51 శాతానికి పైగా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని.. గతంలో వచ్చిన 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గబోదని అన్నారు.

చంద్రబాబు అసత్య హరిశ్చంద్రుడంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన చరిత్ర తెలుగు దేశం పార్టీదే అని విమర్శించారు. ఏపీలో ఇప్పటివరకూ చంద్రబాబుకు స్థిర నివాసం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌ సీపీకి సంపూర్ణ బలం ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం (ఆగస్టు 17) ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 51 శాతానికి పైగా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని.. గతంలో వచ్చిన 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గబోదని అన్నారు.

వైఎస్సార్‌సీపీ ఘన విజయం సర్వేల ద్వారా తేలిపోయిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టును విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. 2024 తర్వాత టీడీపీ అంతర్థానం అయిపోతుందని జోస్యం చెప్పారు. అసాంఘిక వ్యక్తులకు టీడీపీ మద్దతు పలుకుతోందని, అలాంటి పార్టీ అసలు రాజకీయ పార్టీనే కాదని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లోకేష్‌కు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు లేదని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని.. అధికారం కోసం టీడీపీ నేతలు దేశ ద్రోహానికి కూడా వెనకాడబోరని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో కూడా పొత్తు పెట్టుకుంటారని అన్నారు. 

చంద్రబాబు ప్రతీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నారని.. టీడీపీ ఏర్పాటు చేయబోయే కూటమికి గట్టిగా గుణపాఠం చెప్పిస్తామని అన్నారు. చంద్రబాబు తనను తాను సింహంలా ఊహించుకుంటున్నాడని అన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఒక స్థిర నివాసం అనేదే లేదని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుని గొప్ప విజన్‌ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తారని అన్నారు. విజన్‌ 2047 అంటూ కొత్త రాగం అందుకుని.. ప్రజలను నమ్మించి మోసం చేసేందుకే చంద్రబాబు మరో నాటకం మొదలుపెట్టారని అన్నారు. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘నాలుగేళ్లుగా జాతీయ మీడియా సంస్థలు పలు దఫాలుగా నిర్వహించిన  సర్వేల్లో వైస్సార్సీపీకి 51% మించిన ప్రజాదరణ ఉంది. ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కలిపినా 40% దాటలేదు. పంచాయతీ, స్థానికి సంస్థల ఫలితాలైతే మర్చిపోలేనివి. అయినా దింపుడు కల్లం ఆశలతో బాబు గారు ఏవేవో మాయలు, కుట్రలు చేస్తూనే ఉన్నారు. విద్య, వైద్య, రంగాలు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి జగన్ గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. 31 లక్షల గృహాల నిర్మాణం జరుగుతోంది. 17 మెడికల్ కాలేజీలు, వైద్యశాఖలో 53,126 పోస్టుల భర్తీ, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు, నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget