అన్వేషించండి

Amaravati Updates : అప్పట్లాగే ఇప్పుడూ వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రకటనలు - రాజధాని రైతుల పాదయాత్రపై అధికార పార్టీ వివాదాస్పద ప్రకటనలెందుకు ?

తిరుపతికి పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన ప్రకటనలు తరహాలోనే ఇప్పుడు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నా వారు అదే పంథా కొనసాగిస్తున్నారు.

Amaravati Updates :  అమరావతికి భూములిచ్చిన రైతులు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. సుదీర్ఘమైన పాదయాత్ర. రాష్ట్రానికి రాజధాని అవసరమని ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన తమను దారుణంగా వంచించారని వారి ఆవేదన. ఇలాంటి పరిస్థితి మరే రైతుకూ రాకూడదని వారంతా ప్రజల మద్దతు కోసం పాదయాత్ర చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు మాత్రం ఎదురుదాడికి దిగుతున్నారు. వారెవరూ రైతులు కాదంటున్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దా అని ప్రశ్నిస్తున్నారు.  ఈ అంశంలో స్పీకర్ కూడా ఘాటు ప్రకటనలు చేయడం చర్చనీయాంశమవుతోంది. 

ఉత్తరాంధ్ర వరకూ అమరావతి రైతుల పాదయాత్ర !

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా పోయిన ఏపీకి .. రాజధాని కోసం ముప్ఫై వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వారి పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. వారంతా న్యాయం కోసం గతంలో హైకోర్టు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేశారు. అప్పట్లో కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రకటనలు చేశారు. కానీ రైతుల పాదయాత్ర సాఫీగా సాగి పోయింది. ఆ పాదయాత్రలో ఉండగానే హైకోర్టు వారికి ఊరటనిచ్చే తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వం పాటించడం డౌట్‌గా ఉంది కాబట్టి ప్రజల మద్దతు కోసం మళ్లీ ఉత్తారంధ్ర వరకూ పాదయాత్ర ప్రారంభించారు. 

న్యాయం దక్కించుకున్నా  అమలు కావడం లేదని రైతుల ఆవేదన !

గత ప్రభుత్వం ఏకాభిప్రాయంతో అమరావతిని ఖరారు చేసింది. ఆ రోజున ఒక్క పార్టీ కానీ ప్రజాసంఘం కానీ.. ఇతర ప్రాంతాల వారు కానీ తమ ప్రాంతానికి రాజధాని కావాలని అడగలేదు. అందరూ అమరావతిని సమర్థించారు. అయితే అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. రైతులు రోడ్డున పడ్డారు. అయితే హైకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించలేరని.. అలా చేయడానికి హక్కు లేదని తీర్పు చెప్పింది. అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఆ తీర్పును పెద్దగా పట్టించుకోవడం లేదు. 

ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !

అమరావతి రైతులు చేస్తోంది రాజధాని యాత్ర కాదని ఉత్తారంధ్రపై దండయాత్ర అని కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలంటున్నారు. అమరావతి అందరి రాజధాని అని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. అయితే ఒక్క వైఎస్ఆర్‌సీపీ నేతలు తప్ప అందరూ అమరావతే రాజధానిగా ఉండాలంటున్నారు. బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ తెచ్చే రాజధాని వద్దంటున్నారు. గతంలో ఇలాంటి వివాదం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖపట్నం రాజధాని అయితే అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం గుంభనంగా మాట్లాడుతున్నారు. అమరావతికే మద్దతు ప్రకటిస్తున్నారు కానీ విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ముందు ముందు ఈ రాజకీయం మరింత జోరందుకునే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget