అన్వేషించండి

IT Notice To Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు- ఓ జాతీయ న్యూస్‌ పోర్టల్ సంచలన కథనం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నట్టు హిందుస్థాన్‌ టైమ్స్‌ స్టోరీ వేసింది.

IT Notice To Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇన్ఫ్రా  సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా ఆయన వంద కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయని ఆ కథనం సారాంశం. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షోకాజ్‌ నోటీసుల్లో..  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించిందట. 

హిందుస్థాన్ టైమ్స్‌ ప్రచురించిన కథనం ప్రకారం...చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో కాంట్రాక్టు సంస్థలను బెదిరించారని, బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. 

ఇంకా కథనంలో ఏమున్నాయంటే....

2019లో ఐటీ శాఖ అధికారులు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారు. అక్కడ దొరికిన సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది. లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను పిలిపించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపినట్లు సమాచారం.

షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతోపాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు చేసింది. ఆయా పనుల్లో చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారనే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తి ద్వారా బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేసి సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నట్లు ఐటీ గుర్తించిందని ప్రస్తుతం కథనం.  

వీటి పాటు ఆయా కంపెనీల ప్రతినిధుల నుంచి వాంగ్మూలంగా తీసుకుని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. దాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు చూపించారు. అదంతా వాస్తవమేనని శ్రీనివాస్‌ అంగీకరించి సంతకాలు కూడా చేశారు. శ్రీనివాస్‌తోపాటు రఘు, మిగిలిన వారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. వాళ్లు కూడా అదంతా వాస్తవమేనని అంగీకరించి సంతకాలు కూడా చేశారని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌‌లో తేలిందని పేర్కొన్నారు. 

ఈ అక్రమ లావాదేవీలు అన్నీ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ కోడ్‌ భాషలో తన ఈ–మెయిల్‌ ఐడీకే మెయిల్‌ చేసుకుని భద్ర పరిచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారట. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్‌ భాష ‘టన్నుల’ రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలు వెల్లడ­య్యా­యని తెలిపారు. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించారని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
New Delhi Railway Station Accident: కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఆలస్యం- ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గందరగోళం- 15 మందికి అస్వస్థత
కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఆలస్యం- ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గందరగోళం- 15 మందికి అస్వస్థత
Bird Flu Latest News:ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
Big Blow For RCB: ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన స్పిన్నర్
ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన వైనం
Balakrishna: ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.