అన్వేషించండి

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గానికో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్‌ - ఇక్కడ ఏం చేస్తారంటే?

Andhra Pradesh Latest News: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నాడు స్వర్ణాంధ్ర విజన్ యూనిట్స్ ప్రారంభించారు. ఇంతకీ ఈ యూనిట్స్‌లో ఏం చేస్తారు. అవి ఎలా పని చేస్తాయి

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సోమవారం కీలక మార్పునకు శ్రీకారం చుట్టారు. సచివాలయం నుంచి వర్చువల్‌గా 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్‌లు ప్రారంభించారు. ఇక్కడ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారులు, వివిధ రంగాల నిపుణుల బృందాన్ని కూడా అందుబాటులో ఉంచుతారు. ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్య, వాటికి పరిష్కార మార్గాలు, ఇతర అంశాలపై ఇక్కడ చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేస్తారు. 

స్వర్ణాంధ్ర విజన్ యూనిట్‌ల ద్వారా రాష్ట్ర భవిష్యత్‌ మరో స్థాయికి వెల్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 45ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నాని ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక ఆఫీస్‌లు లేవని ఎవరైనా వెళ్తే గెస్ట్ హౌస్‌లు, లేదా పార్టీ ఆఫీస్‌లనే వాడుకుంటున్నారని అన్నారు. వారిని కలవడం ప్రజలకి కూడా ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు స్వర్ణాంధ్ర్ విజన్‌ యూనిట్‌లో ప్రత్యేక ఆఫీస్‌ ఉంటుందని పేర్కొన్నారు. 

స్వర్ణాంధ్ర విజన్ యూనిట్‌ ఆఫీస్‌లో ఒక నోడల్ అధికారి కూడా ఉంటారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చన సమస్యలు తన స్థాయిలో పరిష్కారం అయ్యే వాటిని ఆ వ్యక్తి పరిష్కరిస్తారు. లేదా అంటే కలెక్టర్‌తో మాట్లాడతారు. ఇది రాష్ట్ర పరిపాలనోల సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  

అధికారులు, నిపుణుల బృందం
అధికారులు, నిపుణుల బృందాన్ని ఈ విజన్ సెంటర్‌లో ఉంచుతారు. సచివాలయం నుంచి ఐదుగురు ఉద్యోగులతో కూడిన టీం కూడా ఈ ఆఫీస్‌లో పని చేస్తుంది. ఈ బృందం కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంది.  

స్వర్ణాంధ్ర విజన్ యూనిట్‌ల ముఖ్యమైన పని గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడం. ప్రతి నియోజకవర్గంలో ఒక నోడల్ అధికారి ఉంటారు, ఇతను ఎమ్మెల్యేల సహాయంతో సమస్యలు నేరుగా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తారు. ఉదాహరణకు రోడ్డు దెబ్బతినడం, నీరు అందకపోవడం, లేదా విద్యుత్ సమస్యలు వంటివి సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయి. ఈ వ్యవస్థ ప్రజల సమస్యలు సులభంగా పరిష్కారమయ్యేందుకు దోహదపడుతుంది. గ్రామాల్లో పాలనను మెరుగుపరుస్తుంది.

మౌలిక వసతుల కల్పన
విజన్ ఆఫీస్‌లలో మౌలిక వసతుల కోసం రూ. 10 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం సీఎం చంద్రబాబు చెప్పినట్టు "స్వర్ణాంధ్ర 2047 యూనిట్‌లో ఎమ్మెల్యే చైర్మన్‌గా, జిల్లా అధికారి నోడల్ అధికారిగా ఉంటారు. ఈ కార్యాలయాల్లో మంచి కుర్చీలు, టేబుల్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం." ఈ నిధులతో కార్యాలయాలు సిద్ధం అవుతాయి, ఇది ఎమ్మెల్యేలకు ,అధికారులకు పనిచేయడానికి సులభం అవుతుంది.  

స్వర్ణాంధ్ర లక్ష్యాలు
స్వర్ణాంధ్ర విజన్‌ 2047లో భాగంగా రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పించారు సీఎం చంద్రబాబు. "హెల్దీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అనేది ప్రభుత్వ లక్ష్యం. అందరి ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి." అనే నినాదంతో పని చేస్తున్నారు. 2029 నాటికి స్వల్పకాలిక లక్ష్యాలు సాధించేందుకు ఎమ్మెల్యేలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ యూనిట్‌లు సమస్యలను పరిష్కరించడమే కాదు, స్పష్టమైన లక్ష్యాలను సాధించడానికి  పనిచేస్తాయని అన్నారు.  

ఆర్టీజీఎస్ పర్యవేక్షణ
ఆర్టీజీఎస్ (Real-Time Governance System) ఆధ్వర్యంలో ఆవేర్ వ్యవస్థ ద్వారా 40 పారమీటర్స్‌ను రియల్‌టైమ్‌లో పరిశీలిస్తారు. ఇందులో గాలి నాణ్యత, ఉష్ణోగ్రత, కాలుష్యం, వరదలు, నీటి మట్టాలు అన్నింటి గురించి తెలుసుకుంటారు.  

లక్ష్యాల కోసం ప్లాన్ చేయడం
స్వర్ణాంధ్ర విజన్‌ను 2047 నాటికి రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా యూనిట్‌లు ప్లాన్‌లు రూపొందిస్తాయి. ఎమ్మెల్యేలు ఈ యూనిట్‌ల్లో చైర్మన్‌లుగా ఉంటూ, జిల్లా అధికారులతో కలిసి 2029 నాటికి చిన్న లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తారు. ఉదాహరణకు, రైతుల ఆదాయం పెంచడం, గ్రామాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరచడం వంటి పనుల కోసం ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి.  

నిపుణుల మద్దతు
ఈ యూనిట్‌ల్లో నిపుణుల బృందం ఉంటుంది. ఆ టీంలు ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తుంది. నాలెడ్జి భాగస్వామిగా ఒక ఉత్తమ విద్యాసంస్థను ఎంపిక చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలను సూచిస్తుంది. అదనంగా, ఒక నిపుణుడు లక్ష్యాలను సాధించడానికి గైడ్ చేస్తారు. సచివాలయం నుంచి ఐదుగురు ఉద్యోగులతో కూడిన బృందం కూడా ఉంటుంది. డేటా సేకరణ, ప్లాన్ అమలు వంటి పనుల్లో వీరు సహాయపడతారు.  
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget