అన్వేషించండి

Andhra Pradesh Latest News: మెడికల్ కాలేజీ అప్పగింతకు మరోసారి టెండర్లు! పీపీపీ విధానంపై ముందుకేనంటున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Latest News: పీపీపీ విధానంలో వైద్యకాలేజీలు అభివృద్ధి చేసేందుకు మరోసారి టెండర్లు పిలవడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించింది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాన్యులకు, పేదల ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్యం అందించేందుకు పీపీపీ విధానం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు యత్నించింది ప్రభుత్వం. కానీ ఒక్క ఆదోని కాలేజీ కోసమే బిడ్‌ దాఖలు అయింది. మిగతా కాలేజీలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో రాజీ లేదని పేదలకు మెరుగైన వైద్యం కోసం ముందడుగు వేయాలని సూచించారు. 

రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన తాజా సమీక్షా సమావేశం రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగింది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం విధానంపై ప్రభుత్వం తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించింది. 

పీపీపీ విధానంపై అపోహలు వద్దు

వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వెనుక ఉన్న శాస్త్రీయతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ పద్ధతిని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం ద్వారా ఒక మెడికల్ కాలేజీ లేదా ఆసుపత్రి నిర్మాణ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం ఆర్థిక మద్దతు అందిస్తాయని చెప్పారు. మిగిలిన పెట్టుబడిని ప్రైవేటు సంస్థలు భరిస్తాయని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోందని, పీపీపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. 

మెడికల్ కాలేజీల టెండర్లు- ఆదోనిలో ముందడుగు 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియలో పీపీపీ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే తాజా టెండర్ల ప్రక్రియ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వం మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది. బుధవారం సాయంత్రంతో ముగిసిన గడువులోకా కేవలం కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి బిడ్ దాఖలైంది. ప్రముఖ వైద్య సంస్థ కిమ్స్‌ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ టెండర్ వేసింది. 

మిగిలిన మూడు ప్రాంతాలైన మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో టెండర్లు వేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ప్రభుత్వం స్పందించి పీపీపీ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలులో ఉందని గుర్తు చేస్తోంది. వెనక్కి తగ్గడం లేదని చెబుతోంది. బిడ్లు దాఖలు కాని కాలేజీల కోసం మరోసారి టెండర్లు ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థతో త్వరలోనే ఒప్పందం చేసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రభుత్వం కేవలం భవనాల నిర్మాణంతో సరిపెట్టకుండా ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మందుల లభ్యత, వైద్యుల నియామంపై కూడా దృష్టి సారించిందని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగుతుందని పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget