అన్వేషించండి

Andhra Pradesh Latest News: మెడికల్ కాలేజీ అప్పగింతకు మరోసారి టెండర్లు! పీపీపీ విధానంపై ముందుకేనంటున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Latest News: పీపీపీ విధానంలో వైద్యకాలేజీలు అభివృద్ధి చేసేందుకు మరోసారి టెండర్లు పిలవడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించింది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాన్యులకు, పేదల ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్యం అందించేందుకు పీపీపీ విధానం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు యత్నించింది ప్రభుత్వం. కానీ ఒక్క ఆదోని కాలేజీ కోసమే బిడ్‌ దాఖలు అయింది. మిగతా కాలేజీలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో రాజీ లేదని పేదలకు మెరుగైన వైద్యం కోసం ముందడుగు వేయాలని సూచించారు. 

రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన తాజా సమీక్షా సమావేశం రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగింది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం విధానంపై ప్రభుత్వం తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించింది. 

పీపీపీ విధానంపై అపోహలు వద్దు

వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వెనుక ఉన్న శాస్త్రీయతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ పద్ధతిని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం ద్వారా ఒక మెడికల్ కాలేజీ లేదా ఆసుపత్రి నిర్మాణ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం ఆర్థిక మద్దతు అందిస్తాయని చెప్పారు. మిగిలిన పెట్టుబడిని ప్రైవేటు సంస్థలు భరిస్తాయని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోందని, పీపీపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. 

మెడికల్ కాలేజీల టెండర్లు- ఆదోనిలో ముందడుగు 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియలో పీపీపీ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే తాజా టెండర్ల ప్రక్రియ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వం మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది. బుధవారం సాయంత్రంతో ముగిసిన గడువులోకా కేవలం కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి బిడ్ దాఖలైంది. ప్రముఖ వైద్య సంస్థ కిమ్స్‌ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ టెండర్ వేసింది. 

మిగిలిన మూడు ప్రాంతాలైన మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో టెండర్లు వేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ప్రభుత్వం స్పందించి పీపీపీ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలులో ఉందని గుర్తు చేస్తోంది. వెనక్కి తగ్గడం లేదని చెబుతోంది. బిడ్లు దాఖలు కాని కాలేజీల కోసం మరోసారి టెండర్లు ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థతో త్వరలోనే ఒప్పందం చేసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రభుత్వం కేవలం భవనాల నిర్మాణంతో సరిపెట్టకుండా ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మందుల లభ్యత, వైద్యుల నియామంపై కూడా దృష్టి సారించిందని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగుతుందని పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget