అన్వేషించండి

Nara Lokesh: ఏపీలో ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు - విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేష్

Andhra Pradesh Education News: బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బి వినియోగంపై నివేదిక సమర్పించాలని, దాంతో పాటు మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని లోకేష్ సూచించారు.

AP Education Minister Nara Lokesh reviews Education Department | అమరావతి: ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పారదర్శక విధానాలను మళ్లీ అమలు చేస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శనివారం (జూన్ 15న) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులను సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

మధ్యాహ్న భోజనంపై ఆరా 
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులను ఆయన ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథకం (Mid Day Meals) డైరెక్టర్ అంబేద్కర్ కు సూచించారు. స్కూళ్లలో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధిత విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.

విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌పై ఫోకస్ 
2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని మంత్రి లోకేష్ ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన విద్యార్థుల జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు సైతం సమర్పించాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు స్కూల్ ఎంత దూరంలో ఉందనే వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూసివేశారు, అందుకు కారణాలు తెలపాలన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ పై సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ ను నారా లోకేష్ ఆదేశించారు. 

సీబీఎస్ఈ స్కూల్స్ మీద నివేదికకు ఆదేశాలు 
వైసీసీ హయాంలో బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బి వినియోగంపై సమగ్ర నోట్ ను సమర్పించాలని అధికారులకు ఆయన సూచించారు. సీబీఎస్ఈ స్కూల్స్ మీద నివేదికతో పాటు ఈ అకడమిక్ ఇయర్ లో పదో తరగతి పరీక్షలు రాసే 82వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు. ఈ ఏడాది విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో రిపోర్ట్ ఇవ్వాలని  మంత్రి లోకేష్ చెప్పారు. స్టూడెంట్ కిట్ (Student Kit)ను ఈ నెలాఖరులోగా అందజేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడంపై లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని, తక్షణమే టెక్ట్స్ బుక్స్ పంపిణీ కి ఏర్పాటు చెయ్యాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.

గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునేలా ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget