అన్వేషించండి

AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?

AP CM Delhi Visit: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి దేని కోసం వెళ్తున్నారు అనేదానిపై క్లారిటీ రాలేదు.

AP CM Delhi Visit:  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోాసారి ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా... ఆయన ఢిల్లీ వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈసారి భేటీలో సీఎం ఎవరెవర్ని కలుస్తారు... టూర్ అజెండా ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. 

మార్చి 16న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ టూర్‌ ముగిసి 15 రోజులు కాక ముందే మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం జగన్. 

ఇవాళ సాయంత్రం విశాఖలో పర్యటించనున్నారు సీఎం. అక్కడ జరుగుతున్న జీ20 గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బయల్దేరి అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచే ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. 

మార్చి 17న పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో మోదీతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్‌ సీపీ ఎంపీలు కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిశారు. 

రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం జరగలేదన్నారు జగన్. గతంలో తాను ప్రస్తావించిన అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారని.. అయినా కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 2 సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు కూడా గుర్తు చేశారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు రూ.7,058 కోట్లు రావాల్సి ఉందన్నారు. 

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు వ్యంగ్యపు ట్వీట్లు చేశారు. ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు.. ఇంకో వైపు లిక్కర్ కేసు.. రెండు కేసుల్లో సీబీఐ, ఈడీ దూకుడుగా ఉన్నాయని అందుకే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని టీడీపీ నేతలు అప్పట్లోనే విమర్శలు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Psych Siddhartha Teaser : డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Embed widget