అన్వేషించండి

Amaravati Drone Summit 2024: కాసేపట్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం- సాయంత్రం జరిగే షో కోసం అందరూ వెయిటింగ్

Andhra Pradesh News: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టే డ్రోన్ సమ్మిట్ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ రంగంలో ఉన్న ఉపాధి, ఇతర అవకాశాలను 9 సెషన్స్‌లో చర్చించనున్నారు.

Amaravati News: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ సదస్సులో 9 ప్యానల్‌ డిస్కషన్లు, 50 డ్రోన్ స్టాల్స్ ఆకట్టుకోనున్నాయి. డ్రోన్ విస్తరణకు ఉన్న అవకాశాలు, ఉపాధి మార్గాలు, ఇతర సవాళ్లను ఈ సమ్మిట్‌లో చర్చిస్తారు. ఈ రంగంలో పేరున్న వివిధ సంస్థలకు చెందిన నిపుణులు, అధికారులు, యువకులు భారీగా తరలిరానున్నారు. అన్నింటిపై రెండు రోజుల పాటు క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ఏపీ తన డ్రోన్ పాలసీని ఆవిష్కరించనుంది. 

అమరావతి వేదికగా డ్రోనోత్సవం 

అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇలాంటి సమ్మిట్ అమరావతి వేదికగా తొలిసారి భారీ స్థాయిలో జరుగుతోందని అభిప్రాయపడుతోంది. ఇలాంటి జాతీయ డ్రోన్ సదస్సు గతంలో ఢిల్లీలో జరిగిందని ఇప్పుడు అమరావతిలో జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది.

భారీగా రిజిస్ట్రేషన్లు

ఏపీ ప్రభుత్వం చేపట్టే డ్రోన్ సదస్సుకు జాతీయ స్థాయిలో భారీ స్పందన వచ్చింది. ఇందులో పాల్గొనేందుకు 6,929 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,711 మంది ప్రతినిధులు పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటే... 1,306 మంది చూసేందుకు వస్తామని తెలిపారు. 521 మంది జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటామని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు కోసం 221 అప్లికేషన్లు వచ్చాయి. 

చంద్రబాబు ప్రారంభోపాన్యాసం

కాసేపట్లో ప్రారంభమయ్యే అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి స్పీచ్ ఇస్తారు. అనంతరం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడతారు. డ్రోన్‌ తయారీ రంగాన్ని ఎలా ప్రోత్సహించాలి, తీసుకోవాల్సిన చర్యలేంటీ, డ్రోన్ హబ్‌గా భారత్‌ను తయారూ చేయాలంటే ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చలు ఉంటాయి.  

ఇవాళ సాయంత్రం ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్‌ ప్రదర్శన 
కృష్ణా నదీ తీరంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి జరిగే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు 5,500 డ్రోన్లతో చేపట్టే ప్రదర్శన ఈ సమ్మిట్‌కే హైలైట్‌ కానుంది. ఇది దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షో కానుందని ప్రభుత్వం చెబుతోంది. ఏడు ఆకారాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరో ప్రత్యేకతను చాటుకోనున్నాయి. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ డ్రోన్ ప్రదర్శనను విజయవాడలోని ప్రజలంతా చూసేందుకు ప్రభత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా నాలుగైదు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే డ్రోన్ ప్రదర్శనతోపాటు సాంస్క్రృతి కార్యక్రమాలు ఇతర ప్రొగ్రామ్‌ మొత్తం ఈ తెరపై చూడవచ్చు.  

బహుమతులు కూడా ఇస్తున్న ప్రభుత్వం

ఈ డ్రోన్ సమ్మిట్‌లో నిర్వహించే డ్రోన్ హ్యాకథాన్‌లో విజయం సాధించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు. 9 థీమ్స్‌ను నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేసి ఒక్కో కేటగిరీలో బహుమతులు అందజేస్తారు. మొదటి స్థానం వచ్చిన వాళ్లకు మూడు లక్షలు, రెండో స్థానం వచ్చిన వాళ్లకు రెండు లక్షలు, మూడో స్థానంలో ఉంటే లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. 

Also Read: దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget