అన్వేషించండి

Minister Peddireddy : భూముల సమగ్ర సర్వే కోసం 3 కోట్ల సర్వేస్టోన్స్ -మంత్రి పెద్దిరెడ్డి

 సమగ్ర భూ సర్వే కోసం 3 కోట్ల సర్వేస్టోన్స్ కావాలని మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి అన్నారు. వందేళ్ల తరువాత రాష్ట్రంలో సమగ్ర సర్వే జరుగుతోందన్నారు.

గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమానికి అవసరమైన సర్వేరాళ్లను సిద్దం చేసి అందించే ఆర్డర్ ను రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులకు అప్పగిస్తున్నామని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని వందలాది గ్రానైట్ పరిశ్రమలకు పని లభిస్తుందని, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మందికి ఉపాధి మెరుగవుతుందని అన్నారు.  రాష్ట్రంలో వంద సంవత్సరాల తరువాత సమగ్ర భూసర్వే జరుగుతోందని అన్నారు. ఎటువంటి భూవివాదాలు లేకుండా అత్యంత శాస్త్రీయ విధానంలో జరుగుతున్న ఈ సర్వే కోసం దాదాపు 3 కోట్ల సర్వేరాళ్లు అవసరమని అన్నారు. గ్రానైట్ తో తయారు చేసే ఈ రాళ్ల ఆర్డర్ లను రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడం ద్వారా వారికి  పనికల్పించడం, ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందుకు వచ్చారని, మరిన్ని ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఈ సర్వేరాళ్లను తయారు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు, వారిని ప్రోత్సాహాన్ని అందించేందుకే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

దేశంలోనే టాప్ ఆంధ్రప్రదేశ్

దేశం వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లోనే  అత్యంత వేగంగా సమగ్ర భూసర్వే జరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇందుకోసం కనీసం రోజుకు లక్ష సర్వే రాళ్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రానైట్ లీజుదారుల నుంచి ఉచితంగా ముడిరాయిని సర్వేరాళ్ల కోసం అందిస్తున్నామని తెలిపారు. అయితే సర్వేరాళ్లను సిద్ధం చేసి అందించడంలో అనుకున్న లక్ష్యం అనుగుణంగా ఫ్యాక్టరీలు పనిచేయడం లేదని, అందుకు గల కారణాలను, అడ్డంకులను సమీక్షించేందుకు  అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. గ్రానైట్ లీజుదారుల నుంచి ఉచితంగా అందిస్తున్న ముడిరాయిలో నాణ్యత లేకపోవడం వల్ల రాళ్ళ తయారీలో వ్యయం పెరుగుతోందని, బయటి నుంచి ముడిరాయిని కొనుగోలు చేసి సర్వే రాళ్ళను అందించేందుకు ఫ్యాక్టరీ నిర్వాహకులు సిద్దంగా ఉన్నామంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందుకు గానూ ప్రస్తుతం ఇస్తున్న రేటును పెంచేందుకు ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రానైట్ సర్వేరాళ్ళ రవాణాను కూడా తయారీదారులకే అప్పగించాలని కోరారు. గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని, రేటు విషయంలో సహేతుకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే సర్వేరాళ్ళ తయారీదారులకే రవాణా కాంట్రాక్ట్ ను కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.  ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, అందుకు అవసరమైన సర్వేరాళ్ళను సిద్దం చేసి అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.

లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్ రెవెన్యూ

 వైయస్ జగన్   సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత గనుల శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఈ మూడేళ్ళలో గనులశాఖ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూలో పురోగతిని సాధించామని తెలిపారు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2068 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2790 కోట్లు మైనింగ్ రెవెన్యూ సాధించామని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే రూ. 3414 కోట్లు ఆర్జించడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించి మొత్తం రూ.5010 కోట్ల రూపాయలను సాధిస్తామని, ఈ అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నాన్ వర్కింగ్ లీజుల్లో మైనింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో 5009 క్వారీ లీజులు ఉండగా వాటిల్లో 2285 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మిగిలిన వాటిల్లో కూడా మైనింగ్ ప్రారంభించేలా గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈ ఆక్షన్...అమలులోకి

మైనింగ్ రంగంలో ఔత్సాహికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ-ఆక్షన్ విధానాన్ని  ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా మైనర్ మినరల్స్ కు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 505 ఏరియాలకు ఈ-ఆక్షన్ విధానంను వర్తింప చేశామని, దీనిలో 106 ఏరియాలకు లీజుల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. మరో 110 ఏరియాలకు లీజు ప్రక్రియ దశలో ఉందని, అలాగే 395 ఏరియాలకు లీజుల జారీ ప్రక్రియ ముగింపు దశలో ఉందని వెల్లడించారు. ఈ-ఆక్షన్ పై మైనింగ్ పై ఆసక్తి ఉన్న వారిలో అవగాహన కల్పించేందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్ షోలను నిర్వహిస్తున్నామని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget