అన్వేషించండి

Ambati Rambabu release: కూటమిని కూల్చే వరకూ పోరాడతా - జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు శపథం

Ambati Rambabu: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యారు.కూటమిని కూల్చేంత వరకూ పోరాడతానని భయపడబోనని ప్రకటించారు.

Ambati Rambabu released from Rajahmundry jail:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  అంబటి రాంబాబు సుమారు 19 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం,  2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. వరుసగా ఈ మూడు కేసుల్లోనూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

జైలు నుంచి బయటకు రాగానే అంబటి రాంబాబుకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను జైలు నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించిందని, వరుస కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు.  నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతానని అనుకున్నారు, కానీ రాజమండ్రి జైలు నా పట్టుదలకు శిక్షణగా మారింది  అంటూ వ్యాఖ్యానించారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని, తన ఇంటిపై దాడులు చేసి తన భార్య, పిల్లలను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను జైలులో పెట్టి, నేరస్తులను బయట తిరగనిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, ధర్మం నా వెంటే ఉన్నాయి.. పైన దేవుడున్నాడు, అన్నింటికీ ఒకరోజు సమాధానం చెబుతాను  అని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజాక్షేత్రంలో పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కూటమి ని కూల్చేంత వరకూ పోరాడతానని అన్నారు.        

జనవరి 31న అరెస్ట్ అయిన అంబటి, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆయన జైలులో ఉన్న సమయంలో పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. విడుదల అనంతరం ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. గురువారం ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget