అన్వేషించండి

Minister Botsa: ఉద్యోగులు ఘర్షణ వాతావరణ వీడి చర్చలకు రావాలి... ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేస్తుంది... మంత్రి బొత్స కామెంట్స్

ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గని మంత్రి బొత్స అన్నారు. చర్చించకుండా ఇంట్లోనే కూర్చుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఉద్యోగులు ఘర్షణ వాతావరణ వీడి చర్చలకు రావాలని సూచించారు.

సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు మొండి పట్టుదలకు వెళ్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రభుత్వం చర్చలకు రమ్మంటే ఉద్యోగులు అలుసుగా తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం కొన్ని ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చాయని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చామని మంత్రి తెలిపారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ప్లే స్లిప్ వచ్చాక చూసుకుంటే జీతాలు పెరుగుతాయా లేక తగ్గాయా తెలుస్తోందన్నారు. ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదని మంత్రి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు ఎవరు ముందుకు వచ్చిన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులకు సమస్య అంటే ప్రభుత్వ సమస్య అన్నారు. ఉద్యోగులు ఘర్షణ వాతావరణం వీడి చర్చలకు రావాలని కోరారు. ఉద్యోగులు ఎప్పుడు వస్తామంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురుచూడమని ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని మంత్రి బొత్స అన్నారు. 

ఒక్క రూపాయి జీతం తగ్గదు

ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన సమితి చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. జీతాలు వస్తేనే కదా పెరుగుతాయా, తగ్గుతాయా అనేది తెలుస్తోంది అన్నారు. ఉద్యోగులెవ్వరికీ రూపాయి కూడా జీతం తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ శుక్రవారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామన్నారు. ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం అందుబాటులో ఉందని మరోసారి స్పష్టం చేశారు. 

Also Read: అపోహలు తొలగించుకునేందుకు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రెడీ... కమిటీతో చర్చలకు అంగీకారం !

ఆర్టీసీ సంఘాలు సమ్మెకు మద్దతు

ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. ఆర్టీసీలోని ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు చెబుతున్నారు.  తమకు పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరమేనని కానీ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సమ్మెకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Araku Kauni: గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
Embed widget