News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Minister Botsa: ఉద్యోగులు ఘర్షణ వాతావరణ వీడి చర్చలకు రావాలి... ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేస్తుంది... మంత్రి బొత్స కామెంట్స్

ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గని మంత్రి బొత్స అన్నారు. చర్చించకుండా ఇంట్లోనే కూర్చుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఉద్యోగులు ఘర్షణ వాతావరణ వీడి చర్చలకు రావాలని సూచించారు.

FOLLOW US: 
Share:

సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు మొండి పట్టుదలకు వెళ్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రభుత్వం చర్చలకు రమ్మంటే ఉద్యోగులు అలుసుగా తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం కొన్ని ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చాయని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చామని మంత్రి తెలిపారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ప్లే స్లిప్ వచ్చాక చూసుకుంటే జీతాలు పెరుగుతాయా లేక తగ్గాయా తెలుస్తోందన్నారు. ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదని మంత్రి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు ఎవరు ముందుకు వచ్చిన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులకు సమస్య అంటే ప్రభుత్వ సమస్య అన్నారు. ఉద్యోగులు ఘర్షణ వాతావరణం వీడి చర్చలకు రావాలని కోరారు. ఉద్యోగులు ఎప్పుడు వస్తామంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురుచూడమని ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని మంత్రి బొత్స అన్నారు. 

ఒక్క రూపాయి జీతం తగ్గదు

ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన సమితి చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. జీతాలు వస్తేనే కదా పెరుగుతాయా, తగ్గుతాయా అనేది తెలుస్తోంది అన్నారు. ఉద్యోగులెవ్వరికీ రూపాయి కూడా జీతం తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ శుక్రవారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామన్నారు. ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం అందుబాటులో ఉందని మరోసారి స్పష్టం చేశారు. 

Also Read: అపోహలు తొలగించుకునేందుకు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రెడీ... కమిటీతో చర్చలకు అంగీకారం !

ఆర్టీసీ సంఘాలు సమ్మెకు మద్దతు

ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. ఆర్టీసీలోని ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు చెబుతున్నారు.  తమకు పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరమేనని కానీ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సమ్మెకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

Published at : 28 Jan 2022 04:43 PM (IST) Tags: ap govt AP News AP PRC ap govt employees agitation minister botsa satyanaraya

ఇవి కూడా చూడండి

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

Deadlines in December: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

Deadlines in December: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Latest Gold-Silver Prices Today 29 November 2023: రూ.63 వేలు దాటిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 29 November 2023: రూ.63 వేలు దాటిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Petrol-Diesel Price 29 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 29 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

PM Narendra Modi: మీ ధైర్యం, సహనానికి హ్యాట్సాఫ్, కార్మికులతో ఫోన్‌లో ప్రధాని మోదీ

PM Narendra Modi: మీ ధైర్యం, సహనానికి హ్యాట్సాఫ్, కార్మికులతో ఫోన్‌లో ప్రధాని మోదీ