అన్వేషించండి

Maha Padayatra: నేటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర

Maha Padayatra: గుంటూరు జిల్లా వెంకటపాలెంలో నేడు అమరావతి అమరావతి రైతుల మహా పాదయాత్ర మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రైతుల యాత్ర సాగనుంది.

Maha Padayatra: అమరావతి ఏకైక రాజధాని నినాదంతో రైతులు చేపడుతున్న మలివిడత మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైయ్యే ఈ యాత్రకు అడ్డంకులెన్ని వచ్చినా, యాత్రను ముగించే లక్ష్యంతో రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించి మద్దతు కూడగడతామని ఐకాస నేతలు, రైతులు చెబుతున్నారు.

వెంకటపాలెం నుంచి ప్రారంభం

 గుంటూరు జిల్లా వెంకటపాలెంలో  రేపు అమరావతి మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి చేరుకోవటంతో పాదయాత్ర ముగుస్తుంది. ఆరోజు అక్కడ రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిపై జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరిస్తామని రైతులు చెప్పారు. రాజధానిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తామని వివరించారు. 

12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర

12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రైతుల మహాపాదయాత్ర సాగనుంది. ఆ దారిలో వచ్చే మోపిదేవి, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు.  ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా.. పల్లెలు, పట్టణాలలో నడిచే విధంగా రూట్ మ్యాప్ రూపొందించుకున్నామని తెలిపారు. యాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వివిధ కమిటీలు సమన్వయం చేసేలా ప్రణాళిక తయారు చేశారు.

రైతులకు సంఘీభావం తెలపనున్న నారా లోకేష్

సోమవారం వెంకటపాలెంలో మొదలయ్యే యాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. కృష్ణాయపాలెం వద్ద తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపనున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు రాజధాని అమరావతి 29 గ్రామాలకే పరిమితం కాదని.. రాష్ట్ర ప్రజలందరి సొత్తు అని ఐకాస నాయకులు, రైతులు స్పష్టం చేశారు. అమరావతిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై విషప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. 


మున్సిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అమరావతి రైతులు తెలిపారు. రాజధానిగా అమరావతిని ఉంచాలని తాము కోరుతున్నామని.. ఇతర ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. తమ పాదయాత్రకు మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పక్షాలను, ప్రజలను అమరావతి రైతులు కోరారు. అయితే పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించనుంది. ఈ చర్యను రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

1000 రోజుల అలుపెరుగని పోరాటం

అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులవుతోంది.  దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని.. ఏపీకీ అవసరమేనని  సీఎం జగన్   అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి రైతులు ఉద్యమం ప్రారంభించారు. మూడు రాజధానుల ప్రకటన పాతికవేల మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో  అణుబాంబులా పడింది  అప్పట్నుంచి ఆ రైతులు పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. కులం ముద్ర వేశారు.  పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేసులు పెట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయపోరాటం చేసి అనుకూల తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ వారికి ఊరట లేదు. ఎందుకంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పును శిరసావహించడానికి సిద్ధంగా లేదు

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget