అన్వేషించండి

Top Headlines: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య - తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top News In AP And Telangana:

1. బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య

తెలంగాణ బీసీ నాయకుడు అర్‌.కృష్ణయ్య మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున ఎన్నిక కానున్నారు. మంగళవారం కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ నుంచే నుంచే వైసీపీ తరఫున పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ మధ్య కాలంలో రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఐదు రోజు వారం రోజుల క్రితమే నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారంతో గడువు ముగియనుంది. ఇంకా చదవండి.

2. నంద్యాల జిల్లాలో ఘోరం

ఏపీలో ఘోరం జరిగింది. తనను ప్రేమించలేదనే కారణంతో బాలికపై ఓ ఇంటర్ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లాలో (Nandyal District) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలగొట్లకు చెందిన బాలుడు ఇంటర్ చదువుతున్నారు. తనను ప్రేమించాలని బాలుడు కొంతకాలంగా బాలికను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపారు. 6 నెలల క్రితం బాలుడు అక్కడికి వచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఇంకా చదవండి.

3. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా చదవండి.

4. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత - కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ - అదానీ ఫోటో ముద్రించిన టీషర్టులను ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేట్ వద్దే నిరసన తెలిపారు. టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చిచెప్పగా.. పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సహా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇంకా చదవండి.

5. తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అప్ డేట్

తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అధికారులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget