అన్వేషించండి

Annadata Sukhibhava Pending Money: అన్నదాత సుఖీభవ పథకం: డబ్బులు పడని రైతులకు గుడ్ న్యూస్, త్వరలో రూ.7 వేలు జమ

Annadata Sukhibhava Scheme : ఏపీ ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. కొందరు రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. వారికి త్వరలోనే నగదు జమ అవుతుంది.

Annadata Sukhibhava Scheme | అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చింది. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ పథకానికి అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏపీ ప్రభుత్వం రూ.5000, పీఎం కిసాన్ యోజన స్కీమ్ (PM Kisan Samman Nidhi) కింద కేంద్ర ప్రభుత్వం రూ.2000 రైతులకు అందిస్తున్నాయి.

ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శిలో చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. అదే రోజు అర్హులైన 44.75 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద నగదు జమ అయినట్లు ఏపీ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. 99 శాతానికి పైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా, కొందరి ఖాతాల్లో మాత్రం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ గ్రీవెన్స్‌లో 10,915 మంది రైతులు ఫిర్యాదులు నమోదు చేశారు. వీటిలో ఎక్కువ దరఖాస్తులు ఆమోదం పొందాయని రైతులకు శుభవార్త అందించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వ్యవసాయ శాఖ ప్రకారం, గ్రీవెన్స్‌లో ఆమోదం పొందిన రైతుల ఖాతాల్లో త్వరలోనే రూ.7 వేలు జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతుందని అధికారులు తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకం అధికారిక వెబ్‌సైట్‌ http://annadathasukhibhava.ap.gov.inలో మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా మీకు నగదు వచ్చిందా లేదా అని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వీస్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 95523 00009 వాట్సాప్‌ నెంబర్‌లో సైతం రైతులు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 

రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎందుకు పడలేదంటే.. 
-   ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలు
-   NPCI (National Payments Corporation of India) మ్యాపింగ్ సమస్యలు
-   ఆధార్-బ్యాంక్ లింక్ తప్పులు
-   E-KYC పూర్తి చేయకపోవడం
-   భూ యజమాని మృతి & పాస్‌బుక్ అప్‌డేట్ కాకపోవడం
-   అనర్హత భూములు (ఆక్వా సాగు, వ్యవసాయేతర భూములు)
-   ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల భూములు

ఎవరికి ఈ పథకం వర్తించదు
-   ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు
-   10 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు
-   నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు
-   మైనర్లు
-   E-KYC పూర్తి చేయని వారు
-   NPCI మ్యాప్ కాని బ్యాంక్ ఖాతాలు

అన్నదాత సుఖీభవ నగదు కోసం రైతులు ఏం చేయాలి
-   మీ గ్రామ రైతు సేవా కేంద్రం లేదా MeeSeva వద్ద వెంటనే E-KYC పూర్తి చేయాలి 
-   ఆధార్- బ్యాంక్ అకౌంట్ అనుసంధానం సరిచూసుకోవాలి
-   బ్యాంక్‌లో NPCI మ్యాపింగ్ చెక్ చేయించాలి
-   భూమి పాస్‌బుక్, వారసత్వ పత్రాలు అప్‌డేట్ చేయించాలి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
Pawan Kalyan Birthday : పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్‌తో అభిమాని మృతి
పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్‌తో అభిమాని మృతి
Polavaram Project News: 45.72 మీటర్ల వరకు పోలవరం నిర్మాణం..  2027 జూన్‌కల్లా ఫేజ్-1 పనులు పూర్తి: కేంద్రం 
45.72 మీటర్ల వరకు పోలవరం నిర్మాణం..  2027 జూన్‌కల్లా ఫేజ్-1 పనులు పూర్తి: కేంద్రం 
ఆధ్యాత్మిక పునరుజ్జీవనం: 5 వేల దేవాలయాలు, వెయ్యి ఆలయాల పునరుద్ధరణకు చంద్రబాబు ఆదేశం
ఆధ్యాత్మిక పునరుజ్జీవనం: 5 వేల దేవాలయాలు, వెయ్యి ఆలయాల పునరుద్ధరణకు చంద్రబాబు ఆదేశం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
Polavaram Left Main Canal: ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
Embed widget