అన్వేషించండి

Adulterated Milk Helpline Number: రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాలు.. సమస్య ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

రాజమహేంద్రవరంలోని లాలాచెరువు చౌడేశ్వరినగర్ ప్రాంతంలో పాలు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై చనిపోతున్న ఘటనలో అధికారులు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో వెలుగుచూసిన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ (Acute Renal Failure) ఘటనలపై జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కోరుకొండ మండలం నరసాపురంలో ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ బృందం గ్రామంలోని పరిస్థితులను పరిశీలించడమే కాకుండా, ఈ అనారోగ్య సమస్యలకు గల కారణాలను అన్వేషించేందుకు చేపట్టిన 'ఫ్యాక్ట్ ఫైండింగ్' ప్రక్రియను క్షుణ్ణంగా సమీక్షించింది.

ప్రస్తుతం ఈ ఘటనకు గల మూలాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని తాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, సమగ్ర పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరిలోనైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Adulterated Milk Helpline Number: రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాలు.. సమస్య ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బాధితులకు లేదా ప్రజలకు అత్యవసర సహాయం కావాలన్నా, లేక ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా వెంటనే సంప్రదించడానికి 9494060060 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు అనవసరపు అపోహలను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రాజమహేంద్రవరంలోని లాలాచెరువు చౌడేశ్వరినగర్ ప్రాంతంలో పాలు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురు వృద్ధులు మృతి చెందారు. సోమవారం రాధాకృష్ణమూర్తి (74), ఎన్. శేషగిరిరావు (72), తాడి రమణి చనిపోయారని అధికారులు తెలిపారు. అంతకుముందు భాగిశెట్టి కనకరత్నం, తాడి కృష్ణవేణి అనే ఇద్దరు వృద్ధులు కూడా ఇదే తరహాలో మరణించారు. ఈ నెల 15వ తేదీ నుండి బాధితులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం సుమారు 12 మంది వాంతులు, పొట్ట ఉబ్బడం మరియు మూత్రవిసర్జన కాకపోవడం వంటి తీవ్రమైన లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారితో పాటు ఐదు నెలల చిన్నారి, మూడేళ్ల బాలుడు కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 


Adulterated Milk Helpline Number: రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాలు.. సమస్య ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

పాలు అమ్మిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు

ప్రాథమిక విచారణలో బాధితులందరికీ కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే వ్యక్తి పాలు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. శివరాత్రి రోజున పాలు, పెరుగు చేదుగా ఉన్నాయని, అవి తాగిన తర్వాతే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుండి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ఇప్పటికే టాక్సికాలజీ పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ నివేదికలు వచ్చిన తర్వాతే ఈ మరణాలకు కల్తీ పాలు కారణమా లేదా మరేదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది స్పష్టమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లా అధికారులు, ఆరోగ్య శాఖ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget