Kerala Assembly Elections 2026: కేరళలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల గ్రౌండ్ వర్క్ - గెలుపు కోసం అప్పుడే రంగంలోకి !
Kerala:తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు కేరళలో తమ పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. బండి సంజయ్, విష్ణువర్ధన్ రెడ్డి వారు గ్రౌండ్ లెవల్లో స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభించారు.

BJP leaders from Telugu states have started ground work in Kerala: కేరళ రాజకీయాల్లో పాగా వేయడమే లక్ష్యంగా NDA తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎర్నాకులం జిల్లాలోని కొచ్చి, త్రిపుణితురలో ఎన్డీయే ప్రాంతీయ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కేరళలో కూటమి కార్యకలాపాలను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగుగా నిలిచింది.
కొచ్చిలో ఎన్డీయే ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఈ కార్యాలయ ప్రారంభోత్సవం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, ఎన్డీయే నేత సాబు జాకబ్ , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ కార్యాలయం కేరళ అభివృద్ధి కోసం పనిచేసే ఎన్డీయే కార్యకర్తలకు ఒక సమన్వయ కేంద్రంగా పనిచేయడమే కాకుండా, ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడానికి, ప్రజా సేవా కార్యక్రమాలను విస్తరించడానికి వేదిక కానుంది.
We are proud to announce the inauguration of the NDA Zonal Office at Tripunithura, Kochi, Ernakulam District. The office was inaugurated in the presence of Union Minister Shri Kiren Rijiju, State President Shri Rajiv Chandrasekhar, NDA Leader Shri Sabu Jacob and other NDA… pic.twitter.com/D3qnjjeJrE
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 23, 2026
కేరళ ఎన్నికల బరిలో తెలుగు నేతల సందడి
వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేతలు తమ వంతు బాధ్యతను భుజాన వేసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ , సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే కేరళలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తమ అనుభవాన్ని ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉపయోగిస్తూ, కేరళలోని మారుమూల గ్రామాల్లో కూడా కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Along with Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar, attended a meeting of the SNDP Yogam community; a prominent organization representing backward sections in Kerala, held in Cochin under the Ernakulam Parliamentary constituency.@bandisanjay_bjp
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 23, 2026
During the… pic.twitter.com/mx7yI6v777
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ట వ్యూహం
కేరళలో ఎప్పుడూ ఎల్డీఎఫ్ (LDF) , యూడీఎఫ్ (UDF) మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే అభిప్రాయాన్ని చెరిపివేసేందుకు ఎన్డీయే వికసిత్ కేరళ నినాదంతో ముందుకు వెళ్తోంది. కొత్తగా ప్రారంభించిన జోనల్ ఆఫీస్ ద్వారా పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏకీకృతం చేయనున్నారు. జాతీయ నేతల పర్యవేక్షణ, తెలుగు రాష్ట్రాల నేతల చురుకైన భాగస్వామ్యం కేరళ ఓటర్లలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన మరియు ఉపాధి అవకాశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకుని ఎన్డీయే ప్రచారం సాగిస్తోంది.























