అన్వేషించండి

Top Headlines: సజ్జల భార్గవ్, వర్రా రవీందర్‌పై మరో కేసు - ఎగ్జామ్ ఆన్సర్ షీట్‌పై విద్యార్థి సూసైడ్ లెటర్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. సజ్జల భార్గవ్, వర్రా రవీందర్‌పై మరో కేసు

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్‌ పెట్టి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాళ్లపై పెడుతున్న కేసుల లిస్టు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందల కేసులు నమోదు అయ్యాయి. ఇంకా నమోదు అవుతున్నాయి. ఇందులో సజ్జల భార్గవన్ రెడ్డిసహా కీలకమైన వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్లపై మరో కేసు నమోదు అయింది. పవన్ కల్యాణ్‌పై అసభ్యకరమైన రీతిలో విమర్శించే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని సిద్దవటం మండలానికి చెందిన జనసైనికులు కేసులు పెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌ రెడ్డి ఈ పోస్టులు పెట్టించారని సిద్ధవటం పోలీసులకు జనసేన కార్యకర్త వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా చదవండి.

2. జగన్ నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి

అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదన్న ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. సమావేశం పెట్టిన రోజున నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా జగన్ నే అడిగారని..  జగన్ రాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు వెళతామని చెప్పారని కానీ జగన్ వద్దే వద్దని చెప్పారని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కారణం లేకుండా అసెంబ్లీకి వెళ్లకపోతే ఎలా అని.. ప్రజలకు ఏం సమాధానం చెబుతామని వారిలో కొంత మంది అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి.

3. ఆన్సర్ షీట్‌పై విద్యార్థి సూసైడ్ లెటర్

కుటుంబ తగాదాలు ఆ బాలుడిపై తీవ్ర ప్రభావం చూపాయి. మన అనుకున్న బంధువులే బలి కోరుతున్నారని, ఫ్యామిలీ చిచ్చు పెడుతున్నరని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆ కుర్రాడు తన పరీక్షల ఆన్సర్‌ షీట్‌పై రాసిన సూసైడ్ నోట్ కంట తడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు, చెల్లెళ్లపై ప్రేమ ఉన్నప్పటికీ ఇలా చనిపోతున్నందుకు బాధగా ఉందంటూ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కు సమీపంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇంటర్ మొదటి సంత్సరం చదువుతున్న జెశ్వాంత్ గౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా చదవండి.

4. మీ పిల్లల ఆర్థిక భద్రతకు బోలెడన్ని ఆప్షన్స్

మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, వాళ్లకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు లేదా పొదుపు ప్రారంభించాలి. మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి... కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం నుంచి సుకన్య సమృద్ధి యోజన, బ్యాంక్ ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్‌, పిల్లల కోసం ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ ప్లాన్‌ వరకు అనేక ఎంపికలు నేటి తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా, బెస్ట్‌ ఆప్షన్లను మీ ముందు ఉంచుతున్నాం. ఇంకా చదవండి.

5. సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్

విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డు శుభవార్త తెలిపింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను 10-15 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులపై విద్యాభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల విద్యార్థులకు సబ్జెక్టుల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భోపాల్ ప్రాంతీయ అధికారిక వికాస్ కుమార్ అగర్వాల్ సీబీఎస్‌ఈ ప్రిన్సిపల్స్ సమావేశంలో వెల్లడించారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget