Corona Updates: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా.. 141 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో.. కొత్తగా.. 30,752 శాంపిల్స్ పరీక్షంచగా.. 141 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 165 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు.. మొత్తం 20,73,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,58,227 మంది డిశ్ఛార్జి అయ్యారు. మెుత్తం.. 14,492 మంది వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం 1,073 చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 28/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,792 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,227 మంది డిశ్చార్జ్ కాగా
*14,492 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,073#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rF8CTGp7Vr
60 ఏళ్లు పైబడిన వారు డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా ప్రికాషన్ డోస్(ముందు జాగ్రత్త మోతాదు) పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది అయితే.. వారు డోస్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పింది. '60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రికాషన్ డోస్ కోసం.. డాక్టర్ నుంచి ఏదైనా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే.. వైద్యుడి సంప్రదించండి.' అని ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.
ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్లేవారు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకు వస్తారని రాకేష్ భూషణ్ చెప్పారు. వాళ్లు ప్రికాషన్ డోసు తీసుకోవాలన్నారు. రెండో డోస్ ఎప్పుడు తీసుకున్నారనే దాని ఆధారంగా ప్రికాషన్.. డోస్కు అర్హత ఉంటుందని వెల్లడించారు. రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలని పేర్కొన్నారు.
డిసెంబరు 25న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి జాతినుద్దేశించి మాట్లాడారు. 2022 జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధాని ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఉంటుందని తెలిపారు. అయితే ఆ సమయంలో.. వైద్యుడి వద్ద సర్టిఫికెట్ తీసుకురావాలనే ఆలోచన ఉండేది.. అయితే తాజాగా కేంద్రం ప్రికాషన్ డోసుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పింది.
Also Read: AP BJP : బెయిల్పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !
Also Read: Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















