అన్వేషించండి

PM Kisan Yojana : రైతులకు గుడ్ న్యూస్! నేడు PM Kisan 20వ విడత నిధులు విడుదల, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan Yojana : వారణాసిలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పీఎం కిసాన్ యోజన 20 వ విడత నిధులు విడుదల చేస్తారు.

PM Kisan Yojana : దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతుకు కేంద్రం ఏటా ఆరువేల రూపాయల నగదు ఇస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది తొలి విడత నిధులు ఇవాళ(2 ఆగస్టు 2025)న విడుదల చేయనుంది. వారణాసిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు. ఇప్పటికే 19 విడతలుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తూ వచ్చారు. ఇవాళ 20వ విడత నిధులు జమ చేస్తారు. 

ఏటా ఆరు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  పీఎం కిసాన్ యోజన అమలు చేస్తున్నారు. ఒక్కో విడతలో రెండు వేలు చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 19 విడతలుగా నిధులు వేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 వ విడత నిధులు విడుదల చేశారు. వాస్తవంగా 20 వ విడత నిధులు జూన్‌లో వేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ ఉంది. మొత్తానికి ఆగస్టు 2న వేస్తున్నట్టు కేంద్రం గత వారం ప్రకటించింది. అందులో భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసిలో ఈ నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 20వ విడతలో  20, 500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తారు.  9.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.  

స్టాటస్ ఎలా తెలుసుకోవాలి?

పిఎం కిసాన్ యోజనా డబ్బులు పడ్డాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన కోసం సిద్ధం చేసిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.  

  • మొదటి స్టెప్‌: అధికారిక వెబ్‌సైట్‌: https://pmkisan.gov.inలోకి వెళ్లాలి. 
  • రెండో స్టెప్‌: హోమ్‌పేజ్‌లో“Farmers Corner” విభాగం ఉంటుంది. దానిపైక్లిక్ చేస్తే “Beneficiary Status” లేదా “Know Your Status” అనే ఆప్షన్‌లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేయాలి. 
  • మూడో స్టెప్‌: Aadhaar నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ టైప్ చేసి “Get Data”పై క్లిక్ చేయాలి.  
  • నాల్గో స్టెప్‌: స్క్రీన్‌పై మీ వివరాలు వస్తాయి. ఏ installment ఎప్పుడు జమ అయ్యిందో తెలియజేస్తుంది. తేదీ, బ్యాంక్ పేరు, UTR నెంబర్ వంటి పూర్తి సమాచారాన్ని చూసుకోవచ్చు.

e-KYC పూర్తి చేసిన వాళ్లకు మాత్రమే ఈ నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు e-KYC చేసుకోవాలని అంటున్నారు. అలా e-KYC చేయనివాళ్లకు మాత్రం నిధులు జమ కష్టమంటున్నారు. అందుకే మీ అకౌంట్‌లో డబ్బులు పడలేదు అంటే మీరు కచ్చితంగా e-KYC చేసుకోలేదని అర్థం.

  • e-KYC పూర్తి చేయకుంటే నిధులు జమ కావు
  • OTP ఆధారిత e-KYC లేదా బయోమెట్రిక్ e-KYC చేయించకపోతే పథకానికి అర్హత కోల్పోవచ్చు.
  • Aadhaar & బ్యాంక్‌ఖాతా లింకింగ్ ఉండాలి. లేకపోయినా నిధులు జమ కావు. 
  • ఒకవేళ మీకు నిధులు రావడం లేదూ అంటే మాత్రం బ్యాంక్ వివరాలు సరిచూసుకోండి
  • IFSC కోడ్, అకౌంట్ నెంబర్ తప్పులు లేకుండా ఉండాలి. మీరు దరఖాస్తు చేసుకున్న టైంలో తప్పుగా ఎంటర్ చేసినా నగదు పడదు. 
  • ఖాతా మూసివేత, బ్లాక్, ఫ్రోజెన్ లాంటివేమి ఏమైనా ఉన్నాయో లేదే ఒకసారి బ్యాంకు వారిని అడిగి తెలుసుకోండి.  
  • Land Record & దస్తావేజులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి. 
  • మొబైల్ నంబర్ అప్డేట్ ఉండాలి
  • OTPలు, ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్లు సకాలంలో రావడానికి మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. 

నగదు జమ కాకుంటే ఎవర్ని సంప్రదించాలి? 

  • 1. హెల్ప్‌లైన్‌& CSC సందర్శించాలి. లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి Beneficiary Status చెక్ చేయించుకోండి. ఎక్కడ లోపం ఉందో తెలిసిపోతుంది. 
  • 2. IVRS (155261) లేదా సెంట్రల్ హెల్ప్‌లైన‌(011-24300606, 1800-115-526) ద్వారా కూడా వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.  
    ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. 
  • PM-Kisan గ్రీవెన్స్ పంపిణీ:– వెబ్‌పోర్టల్‌లో“Register Grievance”పై క్లిక్ చేసి, Aadhaar/బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్‌తో ఎంటర్ చేయాలి. తర్వాత మీరు మీ సమస్యను అక్కడ సెలెక్ట్ చేసుకొని ఫిర్యాదు చేయవచ్చు.
  • ఇ-మెయిల్: pmkisan-ict@gov.in, pmkisan-funds@gov.in ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. 
  • జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులు ఉంటారు. వారికి మీ సమస్యను నేరుగా వివరించవచ్చు. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget