అన్వేషించండి

Nizamabad News: హోలీ రోజు కొట్టుకునే ఆ గ్రామంలో రుచికరమైన అరటి పండుతుంది

నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలోనే అరటి సాగు. లాభాలు గడిస్తున్న హున్సా అరటి రైతులు. 200 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్న హున్సా గ్రామ రైతులు. మహారాష్ట్ర, హైదరాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలకు ఎగుమతి

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని హున్సా గ్రామం పేరు వినగానే అందరికీ హోలీ రోజు ఆడే పిడిగుద్దులాటే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడి రైతులు అరటి సాగు చేయటంలోనూ ఫేమస్. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా అరటి పంట సాగు చేయరు. ఒక్క హున్సా గ్రామంలోని రైతులే అరటి పండిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణకు బార్డర్‌లో హున్సా గ్రామం ఉంటుంది. మంజీరా నది ఒడ్డున ఉండే ఈ గ్రామంలో ప్రధానంగా వరి, చెరుకు, పప్పుదినుసులతోపాటు అరటి తోట సాగు చేస్తారు. జిల్లాలో అరటి తోట సాగు ఎక్కడా చేయరు. కేవలం హున్సాలోనే అరటి తోటలు కనిపిస్తాయ్.

హున్సా గ్రామంలో దాదాపు 200 వందల ఎకరాల్లో రైతులు అరటి తోట సాగు చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఇక్కడ అరటి తోటను సాగు చేస్తూ వస్తున్నారు రైతులు. కరోనాతో గత రెండేళ్లు అరటి సాగుతో భారీగా నష్టపోయిన రైతులకు ఈ ఏడాది అరటి సాగుతో వారి కష్టాలు తీరుతున్నాయ్. కరోనాతో రెండేళ్లు అరటి రైతులు నష్టాన్ని చవిచూశారు. ఈసారి అరటి దిగుబడి బాగా పెరగటంతోపాటు ధర కూడా గిట్టుబాటు అవుతోందని హున్సా గ్రామ అరటి రైతులు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా అరటి పండకుండా హున్సా గ్రామంలోనే ఎందుకు సాగు చేస్తారంటే ఈ గ్రామం మంజీరా నది పరివాహకంలో ఉంటుంది. ఇక్కడి నేల అరటి సాగుకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ గ్రామ రైతులు అరటి తోట సాగుచేస్తున్నారు. ఈ అరటి పంట కాలం 12 నుంచి 15 నెలల కాలం. ఈ సమయంలో క్రాఫ్ వస్తుంది. ఈసారి దిగుబడి పెరిగింది. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాకు 1500 నుంచి1800 రూపాయల వరకు ధర పలుకుతోందని అరటి రైతులు చెబుతున్నారు. అరటి తోట సాగుకు ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈసారి ధర గిట్టుబాటు కావటంతో ఎకరాకు రెండున్నర లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తోందని అరటి రైతులు చెబుతున్నారు.

అరటి విత్తనాలను మహారాష్ట్రలోని జల్ గావ్ నుంచి తీసుకొస్తారు. ఎకరాలో 1500 నుంచి 2000 వరకు ప్లాంటేషన్ ఉంటుంది. జీ-9 రకం అరటి తోటను సాగు చేస్తున్నారు. నేరుగా రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఏడాదికి ఒక క్రాప్ ఉంటుంది. క్రాప్ కట్ చేసిన తర్వాత అంతర్ పంటగా మొక్కజోన్న లేదా ఇతర పంటలను పండిస్తారు. ఒక్కసారి నాటిన అరటి ప్లాంటేషన్ అరటి కాయ వచ్చాక ఆ చెట్టును తీసేసి తిరిగి ప్లాంటేషన్ చేస్తారు. సయమంలో ఎక్కువ తీసుకున్నా... లాభాలు బాగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు హున్సా గ్రామ రైతులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget