అన్వేషించండి

Telangana News: తెలంగాణలో పల్లీ రైతులకు గిట్టుబాటు ధర గండం- పత్తి రైతుల మాదిరి ఆత్మహత్యలు తప్పవంటు ఆగ్రహం

Telangana News: తెలంగాణ వ్యాప్తంగా పల్లీ రైతులు రోడ్డెక్కుతున్నారు. స్దానిక మార్కెంట్ కమిటీ అధికారుల చొక్కాలు చిరిగేలా కొడుతున్నారు. ఇంతలా రైతుల ఆగ్రహానికి కారణం ఎవరు. ప్రభ్వుత్వం వదిలేసిందా..

Telangana News: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, వికారాబాద్ ఇలా తెలంగాణవ్యాప్తంగా వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిచిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే క్వింటా ధర ఏకంగా మూడువేలు తగ్గిపోవడంతో నష్టాలు తప్పవంటూ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణాలో వేరుశనగ పంటపై ఆధారపడ్డ రైతులు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రైతులకు పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కు రావడం అటుంచితే నిండా అప్పుల్లో మునిగిపోయే దుస్దితి ఏర్పడింది. 

తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్వింటా వేరుశనగ ధర ఏడువేల రూపాయల నుంచి ఏకంగా రెండు రోజుల్లో నాలుగువేలకు పడిపోయింది. ఇదేమని ప్రశ్నించేందుకు వెళ్లిన రైతులకు అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవ్వడంతో రెచ్చిపోయారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ ను చొక్కా చిరిగేలా కొట్టారు. వికారాబాద్ జిల్లాలో సైతం వందలాదిగా రోడ్డెక్కిన పల్లీ రైతులు, గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళనలు చేశారు. రైతులు ఇంతలా రోడ్డెక్కడానికి ప్రధాన కారణం లాభాలు పక్కన పెట్టి కనీసం గిట్టుబాటు ధరకూడా రాకపోవడమే.

Also Read: గట్టిగా కొడతవా.. సరిగ్గా నిలబడు చూద్దాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు కౌంటర్!

గతంలో 500 రూపాయలు ఉండే ఎరువుల బస్తా ఇప్పుడు 1800 రూపాయలు పలుకుతోంది. విత్తానాల ఖర్చు పెరిగిపోయింది. పురుగు మందుల ధరలు సరేసరి. కూలీల ఖర్చులు సైతం భారంగా మారాయి. ఇలా పెరిగిన ధరలను భరించి, ఆరుగాలం శ్రమించి, వేరుశనగ సాగు చేస్తే ఏకంగా రెండు రోజుల్లో క్వింటాకు మూడువేల రూపాయలు అమాంతం పతనమవ్వడంతో రైతులు తట్టుకోలేకపోతున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు జోరున మంచుకురుస్తున్నా పల్లీలు కోసేందుకు వెళ్లి, రోజంతా పొలంలో శ్రమించి, మార్కెట్‌కు తీసుకొస్తున్నామనారు. ఇక్కడకు వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ, మిల్లర్లు కుమ్మకై ధరలు తగ్గిస్తున్నారని తెలంగాణలో వేరుశనగ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అధిక వడ్డీలతో బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రాకపోతే  ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణా వేరుశనగ రైతన్న.

అయితే దీనిపై మార్కెట్ కమిటీ మరోలా స్పందిస్తోంది. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది వేరుశనగ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యత లేదు. పంట నాణ్యత లేకపోవడం వల్లనే ధరలు అమాంతం పడిపోయాయి. ఇదే విషయం రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. 

మా పంటకు నాణ్యత లేకపోతే రెండు రోజుల క్రితం క్వింటా ఏడువేల రూపాయలకుపైగా ఎందుకు ధర పలికింది. ఇప్పుడు కేవలం రెండు రోజుల్లోనే ఎందుకు ఇంతలా పతనమైంది. ఇందంతా మార్కెట్ కమిటీ అధికారులు చేస్తున్న కుట్ర, కావాలనే రైతులను మంచుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వేరుశనగ రైతల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలకు కనీసం గిట్టుబాటుధర కల్పిస్తామంటూ ప్రకటనలు చేసే ప్రభుత్వాలు, పల్లీ రైతలను ఆదుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాగే వదిలిస్తే గతంలో పత్తి రైతుల ఆత్మహత్యల తరహాలో పల్లీ రైతుల ఆత్మహత్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు రైతులు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే రైతులకు న్యాయం చేయాలనే డిామాండ్ చేస్తున్నారు. 

Also Read: ప్లాట్లు అమ్ముడుపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - సూసైడ్ నోట్ లభ్యం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
Alekhya Chitti: తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
Chilkur Balaji Priest Case: చిలుకూరు బాలాజీ  పూజారిపై దాడి, ప్రధాన నిందితుడికి కోర్టులో ఊరట
చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి, ప్రధాన నిందితుడికి కోర్టులో ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదుTilak Varma Retired out | LSG vs MI మ్యాచ్ లో అతి చెత్త నిర్ణయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
Alekhya Chitti: తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
Chilkur Balaji Priest Case: చిలుకూరు బాలాజీ  పూజారిపై దాడి, ప్రధాన నిందితుడికి కోర్టులో ఊరట
చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి, ప్రధాన నిందితుడికి కోర్టులో ఊరట
Top 10 Govt Schemes: ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన టాప్-10 ప్రభుత్వ పథకాలు - అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు!
ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన టాప్-10 ప్రభుత్వ పథకాలు - అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు!
Rohit Sharma Superb Tactics: విధ్వంసక ప్లేయర్ ఔట్ వెన‌కాల రోహిత్ వ్యూహం.. డగౌట్ లో ఉండి ఐడియాలిచ్చిన హిట్ మ్యాన్..
విధ్వంసక ప్లేయర్ ఔట్ వెన‌కాల రోహిత్ వ్యూహం.. డగౌట్ లో ఉండి ఐడియాలిచ్చిన హిట్ మ్యాన్..
Pawan Kalyan News: పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు, తెలంగాణ అధికారులు వెల్లడి
పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు, తెలంగాణ అధికారులు వెల్లడి
TG Ration Cards: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి చివరి అవకాశం
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి చివరి అవకాశం
Embed widget