Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
గుజరాత్ను చిత్తు చేసి ఆర్సీబీ బ్యాక్-టు-బ్యాక్ రెండోసారి కప్పు కొట్టేసింది. ఈ హిస్టారిక్ విక్టరీ తర్వాత ఆర్సీబీ ప్లేయర్స్ సెలెబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో సాగాయి. అయితే విక్టరీ ట్రోఫీతో ప్లేయర్స్ అందరూ ఫొటోలు దిగుతున్న టైమ్లో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా చేసిన ఒక సైగ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్లేయర్స్ అందరూ షాకయ్యేలా కృనాల్ ఐదు వేళ్లను చూపించడం చూసి.. పక్కనే ఉన్న కింగ్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటిదార్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలిచినందుకు ప్లేయర్స్ అందరూ రెండు వేళ్లను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ కృనాల్ పాండ్యా మాత్రం ఐదు వేళ్లను చూపిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. అది చూసిన కోహ్లీ, పటిదార్ వెంటనే స్పందించి మనం గెలిచింది రెండు కప్పులే కదా బ్రో.. రెండే చూపించు అని చెప్పే ప్రయత్నం చేశారు.
అయినా కృనాల్ వినకుండా ఐదు వేళ్లను చూపిస్తూనే నవ్వేశాడు. దాంతో.. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబై, చెన్నై జట్లను ఎగతాళి చేయడానికే కృనాల్ అలా చేశాడంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి ఐపీఎల్ చరిత్రలో కృనాల్ పాండ్యాకు ఇది ఐదో ఐపీఎల్ టైటిల్. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున మూడుసార్లు కప్పు కొట్టిన కృనాల్.. ఇప్పుడు ఆర్సీబీ తరఫున వరుసగా రెండు టైటిళ్లు అందుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు





















