Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
వన్డే వరల్డ్ కప్ 2027. ఇంకా ఏడాదికి పైగా టైమ్ ఉన్న ఈ భారీ ఈ వెంట్ లో ఎవరు ఆడతారో ఎవరు ఆడరో ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ ఓ ఇద్దరు దిగ్గజాలు ఆ టోర్నీ ఆడాలని...భారత్ కు 16ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ అందించాలని అభిమానులు అంతా కోరుకుంటున్నారు. ఆ ఇద్దరే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ. అయితే రోహిత్, కోహ్లీ లు మ్యాచ్ లు ఆడకుండా చేసే ప్రయత్నాలు ఆ మధ్య కాలంలో భారీగానే జరిగాయి. ముందు టీ20 వరల్డ్ కప్ గెలిచి వాళ్లే యంగ్ స్టర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వాలని రిటైర్మెంట్ ఇచ్చేస్తే...టెస్టుల నుంచి బలవంతంగానే తప్పించారని చెప్పాలి.ఇక వాళ్లిద్దరూ ఆడుతోంది మిగిలింది వన్డేలు మాత్రమే. అక్కడ నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో ఈ ఇద్దరూ దుమ్ము లేపారు. ఆస్ట్రేలియాపై రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకుంటే...సౌతాఫ్రికా పై విరాట్ కోహ్లీ ఇచ్చిపాడ్ ఇన్నింగ్సులు ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుని తమను తప్పించాలనే థాట్స్ బ్యాచ్ కి సౌండ్ లేకుండా చేశారు. మరిప్పుడు రోహిత్ శర్మనే నేరుగా తన ప్లేస్ గురించి మాట్లాడారు. ఓ ఐసీసీ ఈవెంట్ లో అడిగిన ప్రశ్నకు రోహిత్ తనకు, కోహ్లీ కి గ్రేడ్ తగ్గించటంపై రెస్పాండ్ అయ్యాడు. విరాట్, తను ఆ గ్రేడ్స్ కు పట్టించుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయామన్న రోహిత్...తమ ఇద్దరి లక్ష్యం భారత్ కి వన్డే వరల్డ్ కప్ గెలిపించటమే అన్నారు. 2011లో భారత్ వరల్డ్ కప్ ను ముద్దాడినప్పుడు కోహ్లీ అందులో భాగస్వామ్యమైనా అప్పుడు రోహిత్ ఆ జట్టులో లేడు. సో కోహ్లీ కంటే ఎక్కువగా తనకు వరల్డ్ కప్ గెలవటం భారత్ కు 16ఏళ్ల తర్వాత బడా ట్రోఫీని అందించటమే టార్గెట్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. సో వరల్డ్ కప్ వరకూ తను ఉంటానని..వరల్డ్ కప్ ఆడతాననే ధీమాను హిట్ మ్యాన్ చూపించటంపై ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు.























