అన్వేషించండి

Budget 2026 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు

 ఈసారి కేంద్ర ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఏదో ఎన్నికల తాయిలాలు అన్నట్లుగా కాకుండా దాదాపుగా అన్ని రంగాల సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టినట్లు ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2026 వార్షిక బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం.

1. హైదరాబాద్ కు బుల్లెట్ రైలు
 ఈ వార్షిక బడ్జెట్ లో కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ కేంద్రంగా బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేసింది. అయితే ఇది ఏదో ఒక కారిడార్ ఇచ్చారనుకుంటే పొరపాటే హైదరాబాద్ కేంద్రంగా మూడు బుల్లెట్ రైల్ కారిడార్స్ రానున్నాయి.  పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై లను బుల్లెట్ రైలు కారిడార్స్ గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై-పుణే, వారణాసి-సిలిగుడి, ఢిల్లీ-వారణాసి, చెన్నై-బెంగుళూరుతో కలిపి మొత్తం ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

2. ఈసారి కి ఇన్ కమ్ ట్యాక్స్ తగ్గింపులు లేనట్లే
ఆదాయపు పన్ను మరోసారి తగ్గిస్తారని..మధ్యతరగతి వేతన జీవులకు ఇది మరింత హెల్ప్ అవుతుందని ఆశపెట్టుకున్న వాళ్లకు ఈసారి యూనియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఇచ్చింది. కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. కాకపోతే కొన్ని అడ్మిన్ స్ట్రేటివ్ నిర్ణయాల్లో మార్పులు ప్రకటించారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫైలింగ్ కి జులై 31వరకూ టైమ్ కల్పించారు. నాన్ ఆడిట్ బిజినెస్ లు, ట్రస్ట్ లు ఫైలింగ్ చేసుకోవటానికి ఆగస్ట్ 31 వరకూ టైమ్ ఇచ్చారు. ఒక వేళ ఈ రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలంటే ఆ టైమ్ డిసెంబర్ 31 వరకూ ఉండేది కదా దాన్ని మార్చి 31వరకూ పెంచారు. 

3. కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి
 2025లో కేంద్రం ప్రతిపాదించిన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కొత్త చట్టం ద్వారా ఆదాయపు పన్ను నిబంధనులు మరింత ఈజీ అవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులు కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవటానికి టైమ్ కూడా ఇస్తానన్నారు.

4.  డేటా సెంటర్స్ కి ట్యాక్స్ హాలీడే
రీసెంట్ గా మనం చూశాం గూగుల్ వైజాగ్ లో 15 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ తో డేటా సెంటర్ ను అనౌన్స్ చేసింది. ఇలాంటి డేటా సెంటర్లను మరింత ఎంకరేజ్ చేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. అంటే ఇండియాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు తమ డేటా సెంటర్లకు సంబంధించి ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదు..అది కూడా 2047 వరకూ. ఇది చాలా పెద్ద నిర్ణయం డేటా సెంటర్ల మీద ఇన్వెస్టర్లకు

5. రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ ను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
2025 నవంబర్‌లో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.  ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో గనుల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లు ఏర్పాటు చేస్తాం. ఏపీలో మోనజైట్, థోరియం లాంటి రేర్ ఎర్త్ మినిరల్స్ లభ్యమవుతున్నాయి.

6. ఢిపెన్స్ బడ్జెట్
 ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యాన్ని, రక్షణవ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిఫెన్స్ బడ్జెట్ కూడా ఈసారి బాగా కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ రంగంలో ఆధునీకరణ & డీప్ టెక్నాలజీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు మొత్తం ₹5లక్షల 94వేల 585 కోట్లు కేటాయించారు. ఆధునిక యుద్ధ సాంకేతికతల అభివృద్ధికి ‘నేషనల్ సెక్యూరిటీలో టెక్నాలజీ’ కింద 9,800 కోట్లు కేటాయించారు. DRDO పరిశోధన & అభివృద్ధి (R&D): రక్షణ రంగ పరిశోధనలకు ₹17వేల 250 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

7. అందరికీ గృహాలు:
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్లు అనే నినాదంతో PMAY–గ్రామీణ్ పథకానికి 54వేల 917 కోట్లు  కేటాయింపు . ఇందులో కొత్త PMAY–అర్బన్ 2.0కు ₹3,000 కోట్లు కేటాయించగా, పాత PMAY–అర్బన్ పథకానికి ₹18,625 కోట్లు కేటాయించారు.

8.
కంటెంట్ క్రియేటర్లకు ప్రోత్సాహం..
 Animation, Visual Effects, Gaming, Comics  క్రియేట్ చేసేవాళ్లపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో AVGC కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది.

9. పక్షులను చూడటానికి ప్రత్యేక రైళ్లు
దేశవ్యాప్తంగా పక్షి ప్రేమికులను ఎంకరేజ్ చేసేలా...పక్షుల సంరక్షణ కేంద్రాలకు పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక రైళ్లు వేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇంట్రెస్టింగ్. 

10.  ఫారెన్ టూర్స్ కి వెళ్లే ట్యాక్స్ తగ్గింపు
ఫారెన్ టూర్స్ కి వెళ్లే పెద్ద తలనొప్పి ఏంటంటే డబుల్ ట్యాక్స్. ఓ వస్తువు కొంటే అక్కడ ఆదేశంలో డబ్బులు కట్టాలి ఇక్కడ మనదేశానికి డబ్బులు కట్టాలన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ TCS సిస్టమ్ ను సరళతరం చేసింది భారత్. ట్యాక్స్ రిటర్న్స్ వచ్చేంత వరకూ వెయిట్ చేయకుండా ఫారెన్ టూర్స్ కి వెళ్లే వాళ్ల డబ్బు ఆదా అయ్యేలా ట్యాక్స్ గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది కేంద్రం. గతంలో 20 శాతం గా ఉన్న ఈపన్నును 5 శాతానికి కుదించింది.

సో ఇవి ఈ సారి బడ్జెట్ లో కనిపిస్తున్న టాప్ 10 ఇంట్రెస్టింగ్ పాయింట్స్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget